Monday, October 30, 2017

బో‘రింగు’ల రాంబాబు!

బో‘రింగు’ల రాంబాబు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు * 
ఉంగరాల రాంబాబు
తారాగణం:
సునీల్, మియాజార్జ్
పోసాని కృష్ణమురళి
ప్రకాష్‌రాజ్, వెనె్నల కిషోర్
ఆశిష్ విద్యార్థి, రాజీవ్ కనకాల
ఫొటోగ్రఫీ: సర్వేష్ మురారి
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
మాటలు: చంద్రమోహన్‌రావు
నిర్మాత: పరుచూరి కిరీటి
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:
క్రాంతి మాధవ్
*
అందాల రాముడు, మర్యాద రామన్న, పూలరంగడు..ఇవి సునీల్ కమెడియన్ నుంచి హీరోగా మారిన తర్వాత అతడి కెరీర్‌లో చెప్పుకోతగ్గ విజయాలు. ఓనమాలు వంటి చక్కటి సందేశాత్మక చిత్రాన్ని అందించిన క్రాంతి మాధవ్ ఆ తర్వాత ‘మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు’ వంటి హృదయాన్ని కదిలించే ప్రేమకథతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. వీరిద్దిరి కాంబినేషన్‌లో సినిమా అంటే తప్పకుండా వినోదాత్మకంగా అలరిస్తుందనే అనుకుంటారు. అయితే, అలా ఆలోచించి థియేటర్‌కు వెళ్లిన ప్రేక్షకుడిని పూర్తిగా నిరాశపరిచాడు రాంబాబు. హాస్యనటుడిగా మంచి పేరున్న సునీల్ చాలా కాలంగా హీరోగా విజయం సాధించాలని తహతహలాడుతున్నాడు. అలా హీరోగా అడుగుపెట్టాక వచ్చిన ఫామ్‌ను ఏ మాత్రం కొనసాగించలేక పోయాడు. వరుస అపజయాలతో కెరీర్‌ని సందిగ్థంలో పడేసుకున్నాడు. ఎంతో ఆశగా మరోసారి ఈ ‘ఉంగరాల రాంబాబు’తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. సునీల్ కామెడీని విడిచిపెట్టి కమర్షియల్ చిత్రాలు చేస్తున్నాడనే విమర్శలు రావడం.. అతడు చేసిన ఇటీవలీ చిత్రాలన్నీ పరాజయాల పాలు కావడంతో తన చిత్రాల్లో కామెడీ తప్పనిసరి అని భావించి ఆ దిశగా అడుగులు వేసి వెగటు కామెడీతో మరింత వెనక్కు వెళ్లాడు. ప్రేక్షకుడు థియేటర్ లోకి అడుగుపెట్డే ముందు సునీల్ సినిమాలో హాస్యం వుండాలనే ఆశిస్తాడు. అయితే ఆ హాస్యం మచ్చుకైనా కనిపించదు. సగటు కమర్షియల్ చిత్రాల్లో వుండే ఎలిమెంట్స్ అన్నీ వున్నాయి. కానీ ఏం లాభం..? ఆ ఎలిమెంట్స్ ఏవీ సరిగా కుదరక ఏ వర్గాన్నీ ఆకట్టుకోలేకపోయాయి.
కథలోకి వెళదాం... ఎంతో గారాబంగా, అల్లారు ముద్దుగా తాతయ్య (విజయ్‌కుమార్) నీడలో పెరిగిన రాంబాబు (సునీల్) తన చిన్న తనం నుంచి తాతయ్య చెప్పిన కథల్లోని స్వాతంత్య్ర సమరయోధులను ఆదర్శంగా తీసుకునే వాడు. పెద్దయ్యాక వాళ్లని అక్కడే వదిలేసి సినిమా హీరోలను ఆదర్శంగా తీసుకుని వారిలాగే డైలాగ్స్, స్టెప్స్‌కి, ఫైట్స్‌కి ఇన్‌స్పైర్ అవుతాడు. అనుకోకుండా రెండు వందల కోట్ల అప్పుల్ని మిగిల్చి తాతయ్య కన్నుమూస్తాడు. అదే టైంలో బాదం బాబా (పోసాని కృష్ణమురళి) ఆశీస్సులతో ఊహించని విధంగా రెండు వందల కోట్లకు అధిపతి అవుతాడు. తన ఆఫీస్‌లో పనిచేసే సావిత్రి (మియాజార్జ్)ని ప్రేమిస్తాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అందుకోసం వారు కేరళలో వుండే సావిత్రి తండ్రి రంగనాయర్ (ప్రకాష్‌రాజ్) దగ్గరికి వెళ్తారు. ఆయనది కమ్యూనిజాన్ని ఊళ్లో అందరికీ నూరిపోసే క్యారెక్టర్. కార్పొరేట్ విధానాన్ని చీల్చి చెండాడుతూ వుంటాడు. ఫారిన్ కారు కనిపించినా సహించడు. అలాంటి రంగనాయర్ రాంబాబుని అల్లుడుగా చేసుకోవడానికి ఇష్టపడడు. ఆ వూరికి అతిథిగా రావడం వల్ల ఆ క్షణం నుంచి రాంబాబు రంగనాయర్ ఇంట్లోనే వుంటాడు. అతడు పెట్టే టెస్ట్‌లు నెగ్గాడా? తన ప్రవర్తనతో రంగనాయర్‌ని ఎలా మెప్పించాడు? సావిత్రిని ఎలా పెళ్లి చేసుకున్నాడు? అన్నదే చిత్రం క్లైమాక్స్.
కమర్షియల్ సినిమాలు తీయడం చాలా ఈజీ అనుకునే వారికి ఈ చిత్రం పెద్ద గుణపాఠ నేర్పుతుంది. తను చేస్తున్న కమర్షియల్ కథలోనే ఈ సారి కామెడీ వుండేట్లు చూసుకున్నాడు సునీల్. అదిరేటి డ్రెస్సుల్లో కనిపించాలని అర్మానీ దుస్తులు వేసుకుని తన మార్క్ హాస్యాన్ని పండించడానికి చేసిన ప్రయత్నం పూర్తిగా బెడిసికొట్టింది. ఈ సినిమాలో ఏ ఒక్క క్యారెక్టరైజేషన్ కూడా సమంజసం అనిపించదు. హీరోయిన్ ఇంట్లో మందు కొడుతూ, సిగరెట్లు తాగుతూ ఆమె తండ్రి చేత బ్యాడ్ అనిపించుకుంటాడు. ఒక్కోసారి వెకిలి చేష్టలు చేసే రాంబాబు అప్పటికప్పుడు సెంటిమెంట్ డైలాగ్స్ చెప్పేస్తుంటాడు. సామాజిక స్పృహ ఉన్న వ్యక్తిలా దేశంలోని అన్ని సమస్యల గురించి చర్చిస్తాడు. దర్శకుడిగా మంచి ఇమేజ్ వున్న క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సునీల్ కెరీర్‌ని మరింత సందిగ్ధంలోకి నెట్టేసిందని చెప్పొచ్చు. తాతయ్య చెప్పిన కథలు విని ఆ పాత్రలనుంచి స్ఫూర్తి పొందాడని, ఆ తర్వాత సినిమాలు చూస్తూ హీరోలని చూసి ఇన్‌స్పెయిర్ అవుతున్నాడని ఇంట్రడక్షన్ ఎందుకిచ్చారో, ఆ తర్వాత మళ్లీ ఆ ఊసే వుండదు. ప్రతి చిత్రంలో చిరంజీవి స్టయిల్‌ని ఇమిటేట్ చేసే సునీల్ ఈసారి ఆ పని చేయడం కోసం ఇంట్రడక్షన్‌లోనే చూపించారు. ‘ఇంద్ర’లోని ‘దాయి దాయి దామ్మ’ స్టెప్స్‌నూ వదల్లేదు. సునీల్ తను కమెడియన్‌గా క్లిక్ అవడానికి దోహదం చేసిన కొన్ని మేనరిజమ్స్, ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకోవాలని చూశాడు. కానీ బోల్తాపడ్డాడు. చాలా అసహజంగా అనిపించడమేకాకుండా, తను పోషించిన రిజ్ బిజినెస్ మాన్ క్యారెక్టర్ ఏ మాత్రం సూట్‌కాలేదు. కామెడీ కోసం తపించడం అయితే తెలిసింది కానీ స్లో మోషన్ షాట్స్‌లో సూపర్‌స్టార్ రేంజ్ హీరో ఇంట్రడక్షన్‌ని, అవసరం లేకున్నా ఐదు పాటలని మాత్రం విడిచిపెట్టలేదు. అందుకే ఇలా కమర్షియల్ రూట్లోకి వచ్చి నానా తిప్పలు పడ్డారు. ‘ఉంగరాల రాంబాబు’ అనే టైటిల్ వినగానే చక్కని వినోదాత్మకంతో పాటు క్రాంతి మాధవ్ మార్క్ కూడా వుంటుందని అందరూ ఆశిస్తారు. అలాగే యాక్షన్ హీరోగా చాలా సినిమాల్లో రాణించాలని ఆరాటపడుతున్న సునీల్ తనలోని కామెడీ యాంగిల్‌తో మరోసారి అందర్నీ నవ్విస్తాడని ఊహిస్తారు. కానీ సునీల్ ఇటీవల చేసిన ఫ్లాప్‌ల సినిమాలు దీనికంటే నయం అనేంతగా ఉంది. దర్శకుడు క్రాంతి కుమార్ చేసిన సినిమాయేనా? అనిపిస్తుంది. అతడు గతంలో చేసిన సినిమాలను పోలిస్తే. అడుగడుగునా అర్థం పర్థంలేని సన్నివేశాలు.. అనవసరమైన టైమింగ్‌లేని పంచ్‌లు.. కథ, కథనాలతో విసిగి వేసారిన ప్రేక్షకులపై ఒక్కసారిగా వచ్చిపడే పాటలు పిడుగుల్లా అనిపించాయి. ఎవరి ఊహలకి అందని విధంగా మనం ఏ జోనర్ సినిమా చూస్తున్నామో అర్థంకాని విధంగా వుంది. హీరోయిన్ పాత్రకు ఏ మాత్రం ప్రాధాన్యత లేదు. పాటలకే పరిమితమైంది. హీరో ఏది చేసినా సర్దుకు పోయే మనస్తత్వంతో వుంటుంది. రాంబాబు, రంగనాయర్ కనిపించిన ప్రతి సన్నివేశంలో వెనక ఒక ప్రాపర్టీగా వుంటుందే తప్ప ప్రాధాన్యత కనిపించదు. ముఖ్యంగా ఈ వీరిద్దరి మధ్య జరిగే లవ్‌స్టోరీ గురించి చెప్పుకోకపోతేనే బెటర్. చిందర వందరగా వుంది. హీరోయిన్ పుట్టిన రోజు సర్‌ప్రైజ్ చేస్తాస్తానంటూ దుబాయ్ తీసుకెళ్లిన హీరో ఆమెని సర్‌ప్రైజ్ చేయడం మాటేమో కానీ, చూసే ప్రేక్షకులకు మాత్రం టార్చర్ తప్పలేదు. మరీ ఇంత టార్చరా? అనిపించింది. ఇక హీరోయిన్ తండ్రిగా కనిపించిన ప్రకాష్‌రాజ్ పాత్రలో కొత్తదనం లేదు. అలవాటైన పాత్రే అయినా ఆకట్టుకోలేకపోయాడు. రాంబాబుకి ముందు ‘ఉంగరాలు’ తగిలించడం కోసం ‘బాదం బాబా’ అంటూ పోసాని కృష్ణమురళి క్యారెక్టర్ మరీ చీప్‌గా అనిపించింది. ఎలాంటి వినోదం లేదు. ఇది సినిమాకే నాసిరకం ట్రాక్.
సాంకేతిక విభాగాల గురించి చెప్పుకోవాలంటే సర్వేష్ మురారి ఫొటోగ్రఫీ ఒక్కటే బావుంది. ప్రతీ సీన్‌ని అందంగా చూపించాడు. జిబ్రాన్ సంగీంత పేలిపోయింది. ఒక్కపాట కూడా వినసొంపుగా లేదు. చంద్రమోహన్ మాటలు ఎక్కడా ఆకట్టుకోలేదు. నిర్మాత చేసిన భారీ ఖర్చు వృథాయే. మొత్తం మీద సునీల్ ఈ చిత్రంతో బో‘రింగు’ల బాబుగా మిగిలిపోయాడు.
వెనె్నల కిషోర్‌తో కామెడీ పండించాలనుకున్నారు. కానీ అదీ వర్కవుట్ కాలేదు. కొన్ని కామెడీ కోసం సీన్లు తూచ్ అనిపించాయి. కుక్కని వెతుకుతూ అడవిలోకి వెళ్లే సన్నివేశం కానీ, సునీల్ ఫ్రూట్స్ తెచ్చే సీన్ పరమ బోర్‌గా అనిపించాయి. ఆశిష్ విద్యార్థి ట్రాక్ మరీ చెత్తగా వుంది. హీరోని ఏదేదో చేసెయ్యాలని, చివర్లో అతనేమీ చేయకుండానే మిగులుతుంది. రెండు వందల కోట్లు వదిలేసి పోతాడు. ఇదీ ఓ క్యారెక్టరేనా అనిపించింది.
-ఎం.డి అబ్దుల్

క్లాస్‌పైనే గురి!


క్లాస్‌పైనే గురి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6cialis pharmacie cialis rapports de stage.

స్పైడర్ ***
తారాగణం:
మహేష్‌బాబు,
రకుల్ ప్రీత్‌సింగ్
ఎస్.జె సూర్య, భరత్ తదితరులు
కెమెరా: సంతోష్‌శివన్
సంగీతం: హారిస్ జైరాజ్
నిర్మాణం: ఎన్‌విఆర్ సినిమా ఎల్‌ఎల్‌పి, రియన్స్ ఎంటర్‌టైన్‌మెంట్
నిర్మాతలు:
ఎన్.వి ప్రసాద్, రాగూర్ మధు
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:
ఎ.ఆర్ మురుగదాస్
***
మహేష్‌బాబు, మురుగదాస్ కలయికలో సినిమా అంటేనే ప్రేక్షకుల్లో భారీ అంచనాలుంటాయి. గజిని, ఠాగూర్, తుపాకీ వంటి భారీ బ్లాక్ బస్టర్ విజయాల తర్వాత దర్శకుడు మురగదాస్ రూపొందించిన చిత్రం కావడంతో సహజంగానే ‘స్పైడర్’పై అందరిలో ఆసక్తి నెలకొంది. తెలుగులో ‘స్టాలిన్’ తర్వాత మురుగదాస్ దర్శకత్వం వహించిన తెలుగుచిత్రమిదే కావడం విశేషం. ఇటు క్లాస్, అటు మాస్ ప్రేక్షకుల్లో క్రేజ్ ఉన్న హీరో మహేష్‌బాబు తొలిసారిగా చేసిన ద్విభాషా చిత్రం కావడం.. ఈ సినిమా ద్వారా ప్రిన్స్ తమిళ ప్రేక్షకులకు హీరోగా పరిచయం అవడంతో అంచనాలు మరింత పెరిగాయి. మనిషిలో కొంత స్థాయిలో మాత్రమే ఉండే పైశాచికత్వం స్థాయిని మించి పెరిగిపోతే ఆ మనిషి మృగంలా ఎలా మారతాడు? ఏం చేస్తాడు? అతను సమాజానికి ప్రమాదంలా ఎలా పరిణమిస్తాడు? అనే అంశాలతో అల్లుకున్న చిత్రమిది. పాన్ ఇండియా ఇమేజ్ వున్న మురుగదాస్, స్టయల్‌కి మారుపేరైన మహేష్‌ల కలయికలో వచ్చిన ఈ ‘స్పైడర్’ ఎలా వుందో చూద్దాం..
కథలోకి వెళితే.. ఇంటిలిజెన్స్ ఏజెన్సీలో పనిచేసే ఉద్యోగి శివ (మహేష్‌బాబు) ఫోన్‌కాల్ ట్యాప్ చేస్తూ అసాంఘిక కార్యక్రమాలను, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తుంటాడు. ఫోన్ కాల్ ట్యాప్ చేసే సమయంలో అనుమానాస్పదంగా అనిపించిన వాటి వివరాలను అధికారులకు చేరవేయడమే పని. ఫోన్‌లో ఎవరు ఏడ్చినా, ఎవరు హెల్ప్ అని అరిచినా స్పందించేలా సొంతగా సాఫ్ట్‌వేర్‌ను కనిపెడతాడు. ఎవరికి ఎలాంటి ముప్పు ఉన్న వెంటనే స్పందించి వారికి సాయపడుతుంటారు శివ. అలాంటి అతడి జీవితంలోకి అనుకోకుండా ఓ అమ్మాయి (రకుల్ ప్రీత్‌సింగ్) ప్రవేశిస్తుంది. ఎలాంటి పరిచయాలు లేకుండా బ్లైండ్‌డేట్ ద్వారా ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటుంది రకుల్. ఈ విషయం తెలుసుకున్న శివ ఆమె ఫోన్‌కాల్ ట్రేస్ చేసి ఆమెకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తాడు. ఫోన్‌కాల్స్ ట్యాపింగ్ చేస్తున్న క్రమంలోనే ఓ అమ్మాయి తన స్నేహితురాలికి చేసిన కాల్ వింటాడు. ‘మా ఇంట్లో దెయ్యం ఉంది’ అని భయపడుతున్న ఆ అమ్మాయికి సాయంగా వెళ్లమని తన స్నేహితురాలైన ఓ లేడీ కానిస్టేబుల్‌ని ఆ ఇంటికి పంపిస్తాడు శివ. ఆపదలో వున్న అమ్మాయి ఇంటికి వెళ్లిన లేడీ కానిస్టేబుల్‌తో పాటు సహాయం కోసం ఆర్థించిన అమ్మాయి దారుణంగా హత్యకు గురవుతారు. హఠాత్తుగా జరిగిన ఈ సంఘటనకు చలించిపోతాడు శివ. ఆ హత్యకు కారకులైన వారిని కనిపెట్టేందుకు రంగంలోకి దిగుతాడు శివ. ఆ క్రమంలోనే సైకో కిల్లర్ భైరవ (ఎస్.జె సూర్య) గురించి తెలిస్తుంది శివకు. తన ఆనందం కోసం జనాలను హత్య చేసే వ్యక్తి భైరవుడు తన తమ్ముడు (్భరత్)తో కలిసి చేసిన విధ్వంసాలేంటి? ఫలితంగా జరిగిన నష్టాలేంటి? శివకు భైరవుడికి మధ్య ఏం జరిగింది? ఇంతకీ ఆ భైరవ ఎవరు? అతని నేపథ్యం ఏమిటి? ఎందుకు సైకో కిల్లర్‌గా మారతాడు? అతి ప్రమాదకరమైన భైరవను శివ ఎలా తుదముట్టించాడు? అన్నదే కథ.
నేటితరం మనుషులను పట్టించుకోవడం మానేశారు. మానవత్వం అనే మాటను మరచిపోతున్నారు. ఎదుటి వ్యక్తిలో ప్రేమను చూడలేకపోతున్నారు. ఇలాంటి వేగవంతమైన యుగంలో మనం కూడా వేగంగానే ఉండాలి. అదే సమయంలో మనవత్వాన్ని మరిచిపోయన విషయాన్ని సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. సాధారణంగా మురుగదాస్ సినిమాలు వినోదంగా సాగుతూ అంతర్లీనంగా ఒక సందేశం ఉంటుంది. అయితే ఈ సారి మాత్రం వినోదపు పాళ్లను కాస్త తగ్గించి, ఒక సందేశాన్ని కమర్షియల్ ప్యాకేజ్ మాదిరి ప్రేక్షకులకు అందించాడు. మురుగదాస్ సినిమాల్లో బలమైన కథ, కథనం వుంటాయి. ఈ సినిమాలో అవి కనిపించవు. ప్రేక్షకులను ఆసక్తితో కట్టిపడేసే సన్నివేశాలు అందంగా మలచగల దర్శకుడు మురుగదాస్ ఈ సినిమాలో ఒకటి ఆరా తప్ప రక్తికట్టించలేకపోయాడు. మొదటి సగం ఉన్నంత బలంగా రెండవ సగం అనిపించదు. అలాగే సెకండాఫ్‌లో నడిచే మైండ్‌గేమ్ ఎపిసోడ్స్ బాగున్నా, కొంచెం సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. సెకండాఫ్‌లో విజువల్ ఎఫెక్ట్స్ మీద మరింత శ్రద్ధ పెట్టి వుంటే బావుండేది. దర్శకుడు తీసుకున్న లైన్ రొటీన్‌గా అనిపించింది. రోటీన్ లైన్ కావడం.. కామెడీ లేకపోవడం, ఏ క్లాస్ కథనం, ప్లాట్ నెరేషన్ సినిమాను కాస్త బోర్ కొట్టించింది. మురుగదాస్ మార్క్ సందేశం, థ్రిల్లింగ్ అంశాలతో సాగుతుంది. మనకు పరిచయం లేని వాళ్లకు కూడా సాయం చేయడమే నిజమైన మానవత్వం అనే అంశం ఆధారంగా చిత్రాన్ని నడిపించాడు దర్శకుడు. ఒక అమ్మాయి, లేడీ కానిస్టేబుల్ హత్య నుంచే కథ వేగం పుంజుకుంటుంది. ఆ కేసు పరిశోధన తీరు, భైరవ నేపథ్యం లాంటి అంశాలు ప్రేక్షకుడికి ఆసక్తి కలిగిస్తాయి. అక్కడ నుంచి హీరో విలన్‌ల మధ్య కథ నడుస్తుంది. విలన్ సవాల్ విసిరిన ప్రతీసారీ హీరో తన ఇంటిలిజెన్స్‌తో ముప్పును పసిగట్టడం, దాని నుంచి బయటపడేసే ప్రయత్నాలు ఆసక్తికరంగా సాగుతాయి. అయితే దర్శకుడు మురుగదాస్, తన గత చిత్రాల స్థాయిలో ప్రేక్షకులను కథలో లీనం చేయలేకపోయాడు. విలన్ అనుకున్న పనులన్నీ చేసేస్తుండటం, అతను తలపెట్టిన ముప్పు నుంచి గట్టేక్కించేందు హీరో చేసే ప్రయత్నాలు ప్రేక్షకులకు కాస్త మింగుడు పడవు. దర్శకుడు రాసుకున్న కథ, కథనాల్లో అక్కడక్కడ తడబడ్డట్టు కనిపిస్తుంది. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం ఇలా నాలుగు విభాగాలను దర్శకుడు హ్యాండిల్ చేశారు. ఫేస్‌బుక్, వాట్సాప్, టీవి, ల్యాప్ ట్యాప్‌లకు అతుక్కుపోవడం కాదు, పక్కనున్న మనిషికి మన ప్రేమని, ఆప్యాయతని షేర్ చేయండి అంటూ ఇచ్చిన సందేశం మంచిదే, అయినా మరింత జనరంజకంగా తీర్చిదిద్ది వుంటే బాగుండేది. బిసి కేంద్రాల్లోని ప్రేక్షకులను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సింది.
హీరో మహేష్‌బాబు చాలా రోజుల తర్వాత ఇలాంటి క్యారెక్టర్‌లో కనిపించాడు. ఎమోషనల్ ఎలిమెంట్‌తో కూడిన కథలో లీనమై శివగా విశ్వరూపానే్న ప్రదర్శించాడు. న్యూ లుక్‌తో అభిమానులను అలరించాడు. నటనలో సైతం కొత్తదనం కనిపించింది. ఫైట్స్, యాక్టింగ్, డాన్స్ ఇలా అన్నింటిలో తన సత్తాను ప్రదర్శించాడు. ఇంటిలిజెన్స్ బ్యూరో ఆఫీసర్‌గా తనదైన శైలిలో రాణించాడు. దర్శకుడి ఆలోచనల్లో కథానాయకుడు ఒదిగిపోయిన తీరు స్టయిలిష్‌గా సాగుతాయి. ముఖ్యంగా ఎదుటివారి ఏడుపులో ఆనందం కోరుకునే వ్యక్తిగా భైరవుడు (ఎస్.జె సూర్య) ప్రతినాయకుడి పాత్రలో లీనమైన తీరు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సైకో అంటే ఇలా ఉంటాడు అన్న రీతిలో నటనను ప్రదర్శించాడు. హీరోకు, సైకోకు మధ్య బయోవార్ జరుగుతుంది. అలా వీరిద్దరి మధ్య జరిగే వార్ ప్రేక్షకుడికి ఆసక్తికరంగా ఉంటుంది. సైన్స్‌ఫిక్షన్‌తో పాటు లవ్‌ట్రాక్ మాస్ మాసాలాతో దర్శకుడు మేసేజ్ అందించే ప్రయత్నం చేశాడు. మహేష్ క్యారెక్టర్ ఎంత ఫవర్‌ఫుల్ పాజిటివ్ తరహాలో వుంటుందో, సూర్య పాత్ర కూడా అంతే తరహాలో ఫవర్‌ఫుల్ నెగెటివ్ తరహాలో సాగుతుంది. హీరో, విలన్ పోరాటాలకి మధ్య ట్విస్టులు జోడించి, కథపై ప్రేక్షకుల్లో ఆసక్తికలిగించాడు దర్శకుడు. చివరి అరగంటలో దర్శకుడి మార్క్ గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే కనిపించింది. ఏం జరుగుతుందా? అని ఉత్కంఠరేపింది. విలన్ సూర్య తమ్ముడు భరత్‌ను చూస్తుండగానే జనం మధ్య హీరో చంపడంతో ఇంటర్వెల్ కార్డు పడుతుంది. క్రేజీ బ్యూటీ రకుల్ ప్రీత్‌సింగ్ తన పాత్రలో లీనమై నటించింది. రకుల్- మహేష్ మధ్య వచ్చే సన్నివేశాలు చాలా సరదాగా వున్నాయి. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. కేవలం పాటల కోసమే కాకుండా రకుల్ పాత్ర కథలో ఓ ముఖ్యభాగం. సూర్య తమ్ముడిగా నటించిన భరత్ తన పాత్రకు న్యాయం చేశాడు. సాంకేతికత హాలీవుడ్ సినిమాలను గుర్తు చేస్తుంది. సంతోష్‌శివన్ కెమెరా చిత్రానికి హైలెట్‌గా నిలిచింది. ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్ అద్భుతం. విజువల్స్‌లో ఎక్కడా రాజీపడలేదు. స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్ రూపొందించిన యాక్షన్ సన్నివేశాలు హైలెట్‌గా నిలిచాయి. హారిష్ జైరాజ్ సంగీతం సోసోనే. రీ రికార్డింగ్ బావుంది. ఎడిటింగ్ ఫర్వాలేదు. అయితే క్లైమాక్స్‌లో విలన్ అంతమవడం ఉన్నట్టుండి జరిగిపోవడం ప్రేక్షకులకు కొంత నిరాశకలిగింది. మొత్తం మీద ఈ ‘స్పైడర్’ క్లాస్ ప్రేక్షకులకు చేరువైంది.
-ఎం.డి అబ్దుల్

‘రాజుగారి గది-2’

‘రాజుగారి గది-2’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6cialis pharmacie cialis rapports de stage.
రాజుగారి గది-2 
** ఫర్వాలేదు
తారాగణం:
నాగార్జున, సమంత, సీరత్‌కపూర్,
రావు రమేష్, నరేష్, అశ్విన్, నందు,
‘వెనె్నల’ కిషోర్, అభినయ, ప్రవీణ్,
షకలక శంకర్, అవినాష్ తదితరులు.
నిర్మాత: ప్రసాద్ వి.పొట్లూరి
సినిమాటోగ్రఫీ: ఆర్.దివాకరన్
సంగీతం: ఎస్.ఎస్ థమన్
దర్శకత్వం: ఓంకార్
**
రెండేళ్ల క్రితం ‘రాజుగారి గది’ సినిమాలో మాస్ కామెడీని పండించిన దర్శకుడు ఓంకార్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నారు. అదే ఊపులో తొందరపడి వెంట వెంటనే సినిమాలు చేసేయకుండా, రెండేళ్ల గ్యాప్ తీసుకొని మరో హారర్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్షకుల ముం దుకు వచ్చారు. ఆ చిత్రమే ‘రాజుగారి గది-2’. నాగార్జున, సమంత లాంటి క్రేజీ స్టార్లు తొలిసారిగా ఓ హారర్ కామెడీ కథలో నటించడం.. ‘రాజుగారి గది’ని సీరిస్‌గా మార్చిన చిత్రం కావడం.. సమంత పెళ్లి తర్వాత విడుదలైన తొలి చిత్రం కావడం.. ఇవ న్నీ సినిమాపై సహజంగానే ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగేలా చేశాయి. ప్రచార చిత్రాలు కూడా ఈ అంచనాల్ని మరింత రెట్టింపు చేశాయి. టాలీవుడ్‌లో స్టార్ హీరోలు హారర్ కామెడీ చిత్రాల్లో నటించడం అరుదుగా చూస్తుంటాం. నటించడానికి ఇలాంటి కథలో హీరోయిజం ఏముంటుందనేది వాళ్ల అభిప్రాయం కావొచ్చు. అయితే నాగార్జున మాత్రం ఎప్పటికప్పుడూ కొత్త ప్రయోగాలను చేయడానికి ముందుంటారు. అలా చేసిన ప్రయత్నమే ‘రాజుగారి గది-2’. సమంత కూడా ఈ తరహా కథలో నటించడం ఇదే తొలిసారి. మలయాళ సినిమా ‘ప్రేతమ్’ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో మెంటలిస్ట్‌గా నాగార్జున, ఆత్మగా సమంత ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించారో చూద్దాం...
అశ్విన్ (అశ్విన్), కిశోర్ (వెనె్నల కిశోర్), ప్రవీణ్ (ప్రవీణ్) ముగ్గురు ప్రాణ స్నేహితులు. వీళ్లు ఇంట్లో ఒప్పించి సొంతగా ఓ రాజుగారి రిసార్ట్ కొని వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. ఈ బిజినెస్‌లో ఎంతో ఉన్నత స్థానానికి ఎదగాలన్నది వారి ఆశయం. అలా వారి ఆలోచనకు ఓ దెయ్యంతో బ్రేక్ పడుతుంది. ఆ దెయ్యం రిసార్ట్‌లో వారిని భయపెడుతుంటుంది. కంగారుతో ఏం చేయాలో తోచని ఆ స్నేహితులు చర్చి ఫాదర్ (సీనియర్ నరేష్)ని కలుస్తారు. ఆయన ఇచ్చిన సలహాతో మెంటలిస్ట్ రుద్ర (నాగార్జున) రంగంలోకి ప్రవేశిస్తాడు. ఎవరినైనా కళ్లలోకి చూస్తూ మనసులో ఏముందో చెప్పగల సమర్థుడు రుద్ర. ప్రపంచంలోనే అత్యుత్తమ మెంటలిస్ట్‌లలో ఒకరైన ఈయన సైన్స్ గురించి ఎంత తెలిసినా.. మన పాత ఆచారాలను, నమ్మకాలను పాటిస్తుంటాడు. పోలీసులు కూడా పలు కేసులకు సంబంధించి రుద్ర సలహాలు తీసుకుంటుంటారు. ఫాదర్ కోరిక మేరకు రిస్టార్‌లో అడుగుపెట్టిన రుద్రకు సుహానిసా (సీరత్‌కపూర్)పై తొలుత అనుమానం కలుగుతుంది. ఆ తర్వాత అమృత (సమంత) అనే అమ్మాయి ఆత్మ ప్రతీకారం కోసం తిరుగుతుందని తెలుసుకుంటా డు. ఇంతకీ ఆత్మ రూపంలో రిసార్ట్‌లో వున్న అమృత ఎవరు? ఆమె ఎలా చనిపోయింది? ఆమె మరణానికి గల కారణాలేమిటి? ఆ రిసార్ట్‌కి ఆమెకి ఉన్న సంబంధం ఏమిటి? ఎవరిపైన ఆమె ప్రతీకారం? ఆత్మకు రుద్ర ఎలా సాయం చేశాడు? అన్నదే కథ.
నిజానికి కథ పెద్ద గొప్పదేం కాదు. రాబోయే సన్నివేశాల్ని ముందే ఊహించేయొచ్చు. అయినా అడుగడుగునా ఉత్కంఠకేమీ కొదవలేదు. నాగార్జున, సమంతలు కథలో వున్న రెండు ముఖ్యమైన క్యారెక్టర్‌లను చేయడమే సినిమాకి ప్రధాన బలం. వీరిద్దరినీ మినహాయిస్తే ఇది చిన్న సినిమాయే. రుద్రగా మెంటలిస్ట్ పాత్రలో నాగార్జున నటన, న్యూలుక్ ఆకట్టుకున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇది ‘రాజుగారి’ మాయాజాలం! నాగార్జున కనిపిస్తున్నంత సేపూ ప్రేక్షకులకు ఉత్సాహంగానే అనిపిస్తుంటుంది. మోడ్రన్ సెయింట్ రుద్ర పాత్ర లో నాగార్జున విశ్వరూపం చూపించాడు. హీరోయిజమ్ బేస్ చేసుకుని కథను నడపకుండా, కథానుగుణంగా క్యారెక్టర్‌లో ఇమిడిపోయారు. ఇక తన స్థితికి కారణమైన వాళ్లపై పగ తీర్చుకోవాలనే ఆత్మగా సమంత పెర్‌ఫార్మెన్స్ అదిరింది. నాగార్జున, సమంత కలిసి కనిపించే పతాక సన్నివేశంలో ఎమోషన్ బాగా వర్కవుట్ అయింది. హారర్ కామెడీలు అంటేనే ఒక వర్గం ప్రేక్షకులని ఆకట్టుకుంటాయి. అయతే హారర్ బొత్తిగా లేని ఈ సినిమాలో కామెడీ కూడా సరైన రీతిలో పండలేదు. ఫస్ట్ఫా, సెకండాఫ్‌లలో అడపాదడపా వెనె్నల కిషోర్, ప్రవీణ్, షకలక శంకర్ నవ్వించే ప్రయత్నం చేశారు. ప్రధానంగా ఈ చిత్రం సూపర్ నేచురల్ ఎలిమెంట్స్‌తో కూడిన మిస్టరీ డ్రామా. ఈ సినిమాకి కథ, కథనాలు కాస్త నాసిరకంగా వున్నాయి. కథా పరంగా కొత్తదనమే కనిపించలేదు. కథనం మరీ బలహీనంగా వుంది. కారణం లేకుండా కష్టపడితే మనుషులు ఎంతలా బాధపడతారు, మంచి వాళ్లయినా సరే క్రోదంగా ఎలా మారతారు? అనే అంశాన్ని చూపించడం కొంత వరకు బాగానే వుంది. నాగార్జున సమంత కేసును డీల్ చేసిన విధానం, నిజాల్ని కనిపెట్టిన తీరు ఆసక్తికరంగా సాగాయి. ఆడపిల్లల గొప్పతనం గురించి చెబుతూనే, సమాజంలో చెడు ఎదురైనప్పుడు కూడా వాళ్లు ధైర్యంగా ఉండాలని చెప్పే సందర్భాల్లో రుద్రగా నాగార్జున నటన ఆకట్టుకుంది. సమంత పాత్ర సెకండాఫ్‌లో ఎక్కువగా కనిపించింది. సమంత తనకు అందం, అభినయంలో తిరుగులేదని మరోసారి రుజువు చేసింది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో బబ్లీగా కనిపించిన సమంత, దెయ్యంగా భయపెట్టడంలోనూ సక్సెస్ అయింది. ఉన్నంత సేపు తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. అమృత పాత్ర, ఆమె నేపథ్యం కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఆమె తండ్రి పాత్రలో రావురమేష్ కనిపించింది కొద్దిసేపే అయినా, వాహ్..అనిపించాడు. ఇక సీరత్‌కపూర్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. అయినా ఫస్ట్ఫాలో గ్లామర్‌షోతో కనువిందు చేసింది. ఆరంభ సన్నివేశాలు సాదాసీదాగానే వు న్నా, దెయ్యం భయపెట్టడంతోనే కథ ఊపందుకుంటుంది. ద్వితీయార్థం సినిమాకి ప్రధాన బలం. మహిళలకి రక్షణ, జీవితం అంటే ఏమిటి? అనే విషయాలపై ఇచ్చిన సందేశం కదిలిస్తుంది. నాగార్జున, సమంత మధ్య వచ్చే సన్నివేశాలు, సంభాషణలు బాగున్నాయి. కిరణ్ అనే పాత్రలో అభినయ నటన ముఖ్యంగా పతాక సన్నివేశాలకు ప్రధాన బలం అయింది.
‘రాజుగారి గది’తో దర్శకుడిగా నిరూపించుకున్న ఓంకార్ మరోసారి మెప్పించాడు. నాగార్జున, సమంత లాంటి టాప్‌స్టార్స్ వున్నా, కథకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం బావుంది. పూర్తిగా కొత్త టేకింగ్‌తో ఓకే అనిపించాడు. సమంత నుంచి చక్కటి నటనను రాబట్టాడు. అయితే తొలి సగభాగం సన్నివేశాల్లో వినోదంపై మరింత కసరత్తు చేస్తే బాగుండేది. పతాక సన్నివేశాల్లో ‘చిట్టితల్లి’ అంటూ సమంతతో నాగార్జున జరిపిన సంభాషణ ఆకట్టుకుంటుంది. సాంకేతికంగా సినిమా ఉన్నంతగా వుంది. థమన్ సంగీతం, అబ్బూరి రవి మాటలు, దివాకరన్ కెమెరా పనితనం బాగా కుదిరాయి. పాటలు లేకుం డా తెరకెక్కిన ఈ సినిమాలో థమన్ బిట్‌సాంగ్స్‌తో అలరించాడు. తన నేపథ్య సంగీతం కూడా కుదిరింది. ‘చావడానికి కంటే బతకడానికి ఎక్కువ ధైర్యం కావాలి’, ‘నేను దూకి చావలేదు. చనిపోయాకే దూకాను’, ‘క్షమించడం బలవంతుడి లక్షణం’ వంటి మాటలు బాగా పేలాయి.. మనసుల్ని గెలిచాయి. నిర్మాణ విలువలు, గ్రాఫిక్ వర్క్స్ ఆకట్టుకున్నాయి.
హారర్ సినిమాలంటే కేవలం భయపెట్టడం మాత్రమే కాదు.. నవ్వించడం కూడా చేయొచ్చని దర్శకుడు చేసిన ప్రయత్నం బావుంది. ఫర్లేదు.. ఓంకార్ కూడా మంచి కమర్షియల్ సినిమా తీయగలడు అని ఈ చిత్రం ద్వారా నిరూపించాడు.
-ఎం.డి అబ్దుల్

రాజా ది గ్రేట్

రాజా ది గ్రేట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6cialis pharmacie cialis rapports de stage.

రాజా ది గ్రేట్ 
** ఫర్వాలేదు
తారాగణం:
రవితేజ, మెహరీన్
రాధిక, రాజేంద్రప్రసాద్, వివాస్ బాట్నే, ప్రకాష్‌రాజ్, తనికెళ్ల భరణి, పోసాని
శ్రీనివాసరెడ్డి, సన, సంపత్‌రాజ్, హరితేజ
అన్నపూర్ణ తదితరులు
సంగీతం : సాయి కార్తీక్
కెమెరా : మోహనకృష్ణ
ఎడిటింగ్ : తమ్మిరాజు
నిర్మాణం: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
సమర్పణ: దిల్ రాజు
నిర్మాత : శిరీష్
కథ, కథనం, మాటలు, దర్శకత్వం: అనిల్ రావిపూడి
** **
రవితేజ అంటే ఎవ్వరికైనా ‘ఇడియట్’, ‘అమ్మా నాన్న తమిళ అమ్మాయి’, ‘కిక్’లాంటి చిత్రాలు బాగా గుర్తుకొస్తాయి. హీరో క్యారెక్టరైజేషన్‌కు తనదైన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీతో వేరియేషన్ చూపించే అలాంటి మాస్ హీరో నుండి రెండేళ్ల గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘రాజా ది గ్రేట్’. ‘బెంగాల్ టైగర్’ తర్వాత రవితేజ నుండి చిత్రం రావడం.. అది కూడా అంధుడి పాత్రలో నటించడం.. దిల్ రాజుతో పదమూడేళ్ల తర్వాత సినిమా చేయడం.. అభిమానుల్లోనే కాదు, ప్రేక్షకుల్లోనూ ఆసక్తి రెకెత్తించింది. ఒకప్పుడు వరస విజయాలతో బాక్సాఫీస్‌ను కొల్లగొట్టిన రవితేజ నుండి సినిమా వస్తోందంటే వినోదానికి ఏ మాత్రం ఢోకా వుండదని, కచ్చితంగా అందరి మనసుల్ని దోచుకుంటుందని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేవారు. నిర్మాతల్లో కూడా మినిమం గ్యారం టీ నమ్మకాన్ని కలిగించిన హీరో గత కొంతకాలంగా ఎందుకనో బాక్సాఫీస్ సందడికి దూరంగానే వున్నాడు. విజయాలు లేక ఆయనే కాదు, అతడిని నమ్ముకున్న నిర్మాతలూ నీరుగారిపోయారు. ఇలాం టి పరిస్థితులో ‘పటాస్’, ‘సుప్రీమ్’ చిత్రాల ఫేమ్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘రాజా ది గ్రేట్’తో ముందుకొచ్చాడు. మరి రవితేజ అంధుడిగా చేసిన ప్రయోగం ఫలించిందా? తన నటనతో మళ్లీ ఇరగదీశాడా? దర్శకుడు అనిల్ హ్యాట్రిక్ సాధించాడా? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే...
చూపులేని రాజా (రవితేజ)ను వాళ్ల అమ్మ (రాధిక) పోలీస్ ఆఫీసర్‌గా చూడాలనుకుంటుంది. అయితే రాజా అంధుడు కావడంతో అది సాధ్యం కాదు. కానీ పోలీసులకు సాయం చేసే అవకాశం వస్తుంది. అది ఎలాగంటే ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ (ప్రకాష్‌రాజ్) ఓ కేసు విషయంలో విలన్ దేవరాజ్ (వివాన్ బాట్నే) సోదరుడిని ఎన్‌కౌంటర్ చేస్తాడు. దాంతో దేవరాజ్‌లో కసి పెరుగుతుంది. ప్రాణంగా చూసుకునే తమ్ముడిని చంపడంతో పగ పెంచుకున్న దేవ, ప్రకాష్‌రాజ్‌ను చంపేసి, అతడి కూతురు లక్కీ (మెహరీన్)ను హతమార్చాలని చూస్తా డు. లక్కీ కళ్ల ముందే ఆమె తండ్రిని చంపేస్తాడు. లక్కీ మాత్రం విలన్ బారినుంచి తప్పించుకుని దూరంగా డార్జిలింగ్‌కు వెళ్లిపోతుంది. అదే సమయంలో చూపులేని రాజా పోలీస్ అవ్వాలనే యాంబిషన్‌తో పోలీసులతో కలిసి లక్కీని కాపాడే మిషన్‌లో ఎంటరవుతాడు. ఈ విషయంలో ఐజి (సంపత్) రాజాను లక్కీని కాపాడే టీమ్‌లో భాగం చేస్తాడు. లక్కీ డార్జిలింగ్‌లో వుందని తెలుసుకున్న దేవరాజ్ అతడి మనసుల్ని పంపుతాడు. కానీ రాజా వారిని ఎదిరించి లక్కీని కాపాడతాడు. లక్కీకి ధైర్యం చెబుతాడు. రాజా ఇచ్చిన ధైర్యంతో లక్కీ తన సొంత వూరికి వస్తుంది. అప్పుడు ఆమె ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుంది? ఆమెను చంపడానికి దేవ ఏం చేస్తాడు? రాజా వారి బారినుండి లక్కీని ఎలా కాపాడాడు? దేవను ఎలా ఎదిరించాడు? అనేదే సినిమా.
ఒక రకంగా ఇది ఒక ప్రయోగమే అని చెప్పాలి. ఇప్పటి వరకు హీరో సినిమా మొత్తం చూపులేకుండా వుండటమనేది కొత్తదే. పుట్టుకతోనే అంధుడైన వ్యక్తి పట్టుదలతో అన్నింటిలోనూ శిక్షణ తీసుకుని పెరిగి పెద్దయితే ఎలా వుంటాడో దర్శకుడు చూపించే ప్రయత్నం చేశాడు. సినిమా ప్రధాన ప్లస్ పాయింట్ కథలో హీరో రవితేజకు చూపులేకపోవడమే. అయితే హీరో పాత్రలో కాన్ఫిడెన్స్ తప్ప బాధ అనేదే కనిపించలేదు. దర్శకుడు అనిల్ మొదటి నుండి నమ్ముకున్న వినోదానే్న ఈ సినిమాలో చూపిస్తే, హీరో రవితేజ ఎప్పటిలాగే ఎనర్జిక్ బాడీ లాంగ్వేజ్‌తో, మాస్ మేనరిజంతో తెరమీద అల్లరి చేసేశాడు. అసలే రావిపూడి కామెడీ వ్యవహారం.. రవితేజ కామెడీ దాంతో నీరసంగా హీరోయిన్ కనపడే సన్నివేశాలు, పాటల్లో తప్ప సినిమా అంతటా ఫైట్స్‌తో సహా కామెడీని ట్రై చేశారు. కానీ కథను మాత్రం గాలికొదిలేశారు. హీరో రంగ ప్రవేశం చేసేటంత వరకూ రెచ్చిపోయిన విలన్ దేవరాజ్.. అదేంటో ఆ తర్వాత పాసివ్‌గా మారిపోయి దెబ్బ లు తినివచ్చిన తన గ్యాంగ్‌ను చూసుకోవడం, హీరో గొప్ప తనాన్ని ఒప్పుకుంటూ భజన చేస్తుంటాడు. దాంతో హీరో విలన్ మధ్య పోరు అనుకున్నంత ఎస్టాబ్లిష్ కాలేదు. ఇక కథనం విషయానికొస్తే ఫస్ట్ఫా మొత్తాన్ని తీసుకున్న కొద్దిగా కథతో, హీరో పాత్రతో దాని చుట్టూ వినోదాన్ని నడిపిన దర్శకుడు సెకండాఫ్‌లో సైతం దానే్న కొనసాగించడంతో కాస్త లాగినట్లు కనిపించింది. హీరోకి మంచి సీన్స్, ఫైట్స్‌తో మాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. మదర్ సెంటిమెంట్ బాగానే పండింది. అయితే కథ రోటీన్‌దే కావడంతో కాస్త నిరాశే కలిగించింది. కావాలనే కొన్ని సన్నివేశాలను పెట్టి క్లైమాక్స్‌ను పొడిగించారు. పాటలు కూడా సోసోనే. అలాగే ప్రీ క్లైమాక్స్ దగ్గరలో ఓ పెద్ద ఫైట్ జరుగుతుంది. అది అయిపోగానే సినిమా అయిపోయిందనుకుంటాం అంతా. అయితే ఇంకా ఉంది అని మళ్లీ మొదలెడతాడు దర్శకుడు. ఇక్కడే ఎడిటర్, దర్శకుడు జాగ్రత్త తీసుకోవాల్సింది. అంధుల పాత్రని ఒక రీతిన ‘పాసివ్’గా చూపించాలనే పద్ధతులని కాదని ‘రాజా ది గ్రేట్’ని చాలా యాక్టివ్‌గా చూపించాడు దర్శకుడు. అయితే సగటు మాస్ కథానాయకుడి పాత్రలా కాకుండా సమ్‌థింగ్ గ్రేట్ అనిపించేలా ఈ క్యారెక్టర్‌ని తీర్చిదిద్దడంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే బావుండేది. మామూలుగా అన్నీ సవ్యంగా వుండే వారికన్నా అంధులకి జాపశక్తితో సహా చాలా విషయాల్లో ఎక్కువ నేర్పు వుంటుంది. అలాంటివి వాడుకుంటూ విలన్‌ని హీరో దెబ్బ కొడుతుంటే బాగానే వుంటుంది. కానీ, పరుగెత్తే రైళ్లు, ఎగిరే విమానాలు ఏదైనా ఎక్కేయగలరు అని చూపిస్తే ఎలా? యాక్షన్ పార్ట్ దాదాపు అంతా ఎన్నో అసంబద్ధమైన, అసహజమైన సన్నివేశాలతో నిండిపోయింది.
రవితేజ ఎప్పటిలాగే తన మార్కుతో రాణించాడు. అంధుడిగా అదిరిపోయే నటనతో ఆకట్టుకున్నాడు. మామూలు డైలాగులని కూడా పర్‌ఫెక్ట్ టైమింగ్‌తో చెప్పి మరింత నవ్వించాడు. ‘ఏమో సార్ నాకు కనపడదు’ అనే సింగిల్ డైలాగ్‌తో బ్యాంక్ రాబరీ సీన్‌లో రవితేజ పుట్టించిన హాస్యం సూపర్. ‘ఐయామ్ బ్లైండ్.. బట్ వెల్ ట్రైన్డ్’ అని హీరో చెప్పుకునేట్టు యాక్షన్ సీన్స్‌ను బాగానే ప్లాన్ చేశారు. రవితేజ ఎంట్రీ, కబడ్డీ సీన్ము ఆకట్టుకుంటాయి. రవితేజ తనయుడు మహాధన్ రవితేజ చిన్నప్పటి పాత్రలో ఆకట్టుకోగా, రవితేజ తల్లి పాత్రలో రాధిక పండించిన సెంటిమెంట్ బాగా వర్కవుట్ అయింది. హీరోయిన్ మెహరీన్ ఎక్కువగా గ్లామర్‌కే అంకితం అయిపోయింది. ఢిల్లీ బ్యూటీ రాశీఖన్నా ఓ ఐటమ్ సాంగ్‌లో మెరిసింది. ప్రకాష్‌రాజ్, శ్రీనివాసరెడ్డి, తనికెళ్ల భరణి, రాజేంద్రప్రసాద్, సంపత్‌రాజ్ ఇలా ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. విలన్‌గా వివాన్ బాట్నా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. పోసాని కృష్ణమురళి, హరితేజ తదితరులపై తీసిన ఎపిసోడ్ నవ్వుల్లో ముంచెత్తుతుంది. ‘గున్నా గున్నా మావిడి’ సాంగ్ ప్లేస్‌మెంట్ భలే కుదిరింది.
సాంకేతిక విషయానికొస్తే.. సంగీత దర్శకుడు సాయి కార్తీక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నా పాటలు సంగీతం అంతలా మెప్పించలేదు. మోహ న కృష్ణ సినిమాటోగ్రఫీ ఓకె. డార్జిలింగ్ అందాలను బాగానే చూపించాడు. వెంకట్ ఫైట్స్ సోసోగానే వున్నాయి. అయితే కబడ్డీ ఫైట్‌తో పాటు మరో రెండు ఫైట్స్ మాస్‌ని మెప్పిస్తాయి. ఎడిటింగ్ విషయంలో తమ్మిరాజు సెకండాఫ్ చివరను కాస్త ట్రిమ్ చేసుండాల్సింది. నిర్మాత దిల్ రాజు ఎప్పటిలాగే తన నిర్మాణ విలువల్ని చాటుకున్నారు.
మొత్తం మీద మరోసారి రవితేజ తన మాస్ మార్కుతో అభిమానుల్ని ఆకట్టుకున్నాడు. అంధుడిగా రవితేజ నటన బావున్నప్పటికీ, కథ విషయంలో దర్శకుడు మరింత జాగ్రత్త పడివుంటే అన్ని విభాగాల్లో ఈ ‘రాజా’ నిజంగానే గ్రేట్ అనిపించి వుండేది!
-ఎం.డి అబ్దుల్

ఉన్నది ఒకటే జిందగీ

ఉన్నది ఒకటే స్నేహం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6cialis pharmacie cialis rapports de stage.
ఉన్నది ఒకటే జిందగీ 
** ఫర్వాలేదు
తారాగణం:
రామ్, అనుపమ పరమేశ్వరన్
లావణ్య త్రిపాఠి, శ్రీవిష్ణు, రాజ్
కిరిటీ, ప్రియదర్శి, ఆనంద్ అనీషా ఆంబ్రోస్ తదితరులు
ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్
కెమెరా: సమీర్‌రెడ్డి
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సమర్పణ: స్రవంతి రవికిషోర్
నిర్మాత: కృష్ణ చైతన్య
రచన-దర్శకత్వం: కిషోర్ తిరుమల
ఎనర్జిటిక్ హీరో రామ్, దర్శకుడు కిషోర్ తిరుమల కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘నేను శైలజ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. అదే ఉత్సాహంతో మరోసారి వీరిద్దరూ కలిసి ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చారు. వీరి కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం సక్సెస్ కావడం.. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించడంతో ఈ సినిమాపై అదే స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ప్రేమ, స్నేహం మధ్య ప్రధానంగా సాగిందీచిత్రం. ప్రతి వ్యక్తి జీవితంలో ప్రేమ, స్నేహం రెండూ ముఖ్యమైనవే. దేని ప్రాధాన్యత దానిదే. అయితే ఆ ప్రాధాన్యత వ్యక్తులను బట్టి, పరిస్థితులను బట్టి కూడా ఆధారపడి వుంటుంది. ‘నేను శైలజ’, ‘హైపర్’ తర్వాత రామ్ నటించిన చిత్రమిదే. అనుపమూ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠితో పాటు శ్రీవిష్ణు కీలక పాత్రను పోషించిన ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పించిందో చూద్దాం..
కథలోకి వెళితే.. స్నేహమేరా ప్రాణం అనుకునే యువకుడు అభి (రామ్) ఎత్తుపల్లాలు ఎన్ని ఎదురైనా జీవితం మొత్తం మనతో వుండేవాడే స్నేహితుడంటాడు. అలాంటి అభికి స్కూల్‌లో తనతో పాటు చదువుకునే వాసు (శ్రీవిష్ణు) అంటే చెప్పలేనంత ప్రాణం. వాసు జోలికి ఎవరు వచ్చినా అస్సలు ఊరుకోడు.. ఎదురుతిరుగుతాడు. అంతేకాదు, చిన్నప్పుడే మంచి స్కూల్‌లో సీటు లభించినా వాసు కోసం వదులుకుంటాడు. వారి వయసుతో పాటు స్నేహం కూడా పెరిగి పెద్దవుతుంది. పెద్దయ్యాక నలుగురు స్నేహితులతో కలిసి రాక్ బ్యాండ్ మొదలెడతాడు. అభికి వాసుతో పాటు మ్యూజిక్ అంటే కూడా అంతే ఇష్టం. అలా ఎంతో హాయిగా సాగిపోతున్న వారి జీవితాల్లోకి ఓ సంఘటన కారణంగా మహా (అనుపమా పరమేశ్వరన్) అనే అమ్మాయి ఎంటరవుతుంది. మహాకు కూడా సంగీతమంటే ప్రాణం. కానీ ఇంట్లో వాళ్లు ఆమెను డాక్టర్‌గానే చూడాలనుకుంటారు. దాంతో ఆమె అదే వృత్తిలో అయిష్టంగానే కొనసాగుతుంటుంది. ఆ సమయంలో తన కుటుంబ సమస్యల విషయంలో అభి ఆమెకు ధైర్యం చెబుతాడు. డాక్టర్ చదువుకున్నా, తనకు సింగర్ కావాలని, స్టేజ్‌పై పాటలు పాడాలనే కోరిక ఉంటుంది. ఆ కోరికను తెలుసుకున్న అభి తన రాక్ బ్యాండ్‌లో పాడే అవకాశం ఇస్తాడు. అంతేకాదు, ఆమె అభిప్రాయాలకూ విలువనిస్తాడు. దాంతో ఒకరంటే ఒకరికి ప్రేమ పుడుతుంది. కానీ వారి ఇష్టాఇష్టాలను ఒకరికొకరు చెప్పుకోరు. మనసులోనే దాచుకుంటారు. అయితే మహా తన ప్రాణ స్నేహితుడు వాసు మరదలని, ఆమెను వాసు కూడా ఇష్టపడుతున్నాడని అభికి తెలుస్తుంది. ప్రాణ స్నేహితుల మధ్య ఈగోలు రాకూడదన్న ఒప్పందంతో ఇద్దరూ ఒకేసారి మహాకు ప్రపోజ్ చేస్తారు. కానీ ఆమె మాత్రం వాసుకే ఓకె చెబుతుంది. ఆ తర్వాత వాసు, ఫ్రెండ్స్ కన్నా ఎక్కువగా మహాపైనే ఎక్కువ ఆసక్తి కనబరుస్తుండటంతో కోపంతో అభి వాసుకు దూరంగా వెళ్లిపోతాడు. అయితే అక్కడ అభికి అనుకోని సంఘటనలు ఎదురవుతాయి అవేమిటి? ప్రాణ స్నేహితుడిని కాదని అభి అలా ఎందుకు వెళ్లిపోయాడు? ఇద్దరూ తిరిగి కలుసుకున్నారా? మహా - వాసుల మధ్య ఏం జరిగింది? వీరి కథలో వెడ్డింగ్ ప్లానర్ మేఘన (లావణ్య త్రిపాఠి) పాత్ర ఏమిటి? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే...
ప్రేమకథల్లో పెద్దగా చెప్పుకోవడానికి కొత్త అంశాలు ఏమీ ఉండవు. కాకపోతే కథ, కథనమే కీలక అంశాలు. అలాంటి అంశాలను సినిమా ఆరంభం నుంచి చివరి వరకు నడిపించే తీరుపైనే సినిమా సక్సెస్ ఆధారపడి వుంటుంది. ‘నేను శైలజ’తో రామ్‌ను సరికొత్తగా చూపించిన దర్శకుడు కిషోర్ తిరుమల మరోసారి తన వంతుగా కొత్త ప్రయోగమే చేశాడు. ప్రేమ, స్నేహం అనే రెండు అంశాలను బేస్ చేసుకున్న కథలో ఈ రెండింటినీ పస్ట్ఫా వరకు బాగానే బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాడు. కానీ సెకండాఫ్‌కి వచ్చే సరికి సన్నివేశాల్లో ఏ మాత్రం కొత్తదనం కనిపించలేదు. ద్వితీయార్థంలో పతాక సన్నివేశాల ముందు వరకు ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతుంది. అయితే ఎమోషనల్ సీన్స్, పతాక సన్నివేశాల్లో దర్శకుడి ప్రతిభ కనిపించింది. అయితే తొలిభాగం మరింత వేగంగా కథ నడిపివుంటే బాగుండనిపిస్తుంది. ఇంటర్వెల్ వరకు కథలో పెద్దగా ట్విస్ట్‌లు లేకుండా ఫ్రెండ్స్‌తోనే కథ నడిపించటం కాస్త ఇబ్బంది పెడుతుంది. తెలుగులో గతంలో స్నేహం, ప్రేమ మధ్య ఇరుక్కున్న ఇద్దరు స్నేహితుల కథలు బోలెడొ చ్చాయ. దర్శకుడు తిరుమల ఈ పాత కథకి కొత్త కోణం ఇవ్వలేకపోయాడు. ఒక కారణం మీద దూరమైన ఇద్దరు స్నేహితులు తిరిగి ఎలా ఒకటయ్యారనేది ఈ చిత్రం ఇతివృత్తం. అయితే స్నేహితులు విడిపోవడానికి బలమైన కారణం కానీ, ఇద్దరూ తిరిగి ఒకటయ్యేందుకు తగిన సందర్భంకానీ సరైన విధంగా సృష్టించలేకపోవడం ఈ చిత్రంలో పెద్ద లోపం. ఒకే అమ్మాయితో ప్రేమలో పడ్డ ఇద్దరు స్నేహితుల కథలో దర్శకుడు కొత్తగా చూపించిందంటూ ఏదైనా వుంటే, ఇద్దరూ ఒకేసారి ఆమెకి ప్రేమిస్తున్నానని చెప్పడం.. ఇద్దరిలో ఎవరు నచ్చారో ఆలోచించుకుని చెప్పమనడం. ఈ పాయింట్ తర్వాత కథ ఆసక్తికరంగా ఉంటుందని అనుకుంటే పొరపాటే. ఒక్కసారిగా గొడవకి దారితీసి, ఇద్దరు ప్రాణ మిత్రులు దూరమైపోయే ఘట్టం చోటు చేసుకుంటుంది. విడిపోవడానికి బలమైన కారణం వున్నట్టయితే మళ్లీ కలవడానికి అలాంటి గట్టి కారణాలు వుండి తీరాలి. మాట్లాడుకుంటే తొలగిపోయే మనస్పర్థలు కావడం వల్ల తిరిగి కలుస్తారో లేదో అనే సంఘర్షణకి తావులేకుండా పోయింది. స్నేహితులు ఇద్దరి మధ్య ఎంత అనుబంధం వుందనేది డైలాగుల్లో చెబుతుంటారే తప్ప, వారి గాఢమైన స్నేహా న్ని చూపించే సన్నివేశం ఒక్కటీ లేకపోవడం మరో బలహీనతే. దర్శకుడు కేవలం మాటలతో సరిపెట్టకుండా ఫ్రెండ్‌షిఫ్ ఎంత గాఢమైనదో తెలిపే సన్నివేశాలపై దృష్టిపెడితే బావుండేది. ఫ్రెండ్‌షిఫ్ అంటూ హీరో అనుక్షణం అతని ధ్యాసలోనే వుంటాడు కానీ, మాటల్లో కాకుండా, అతని స్నేహాన్ని చేతల్లో చూపించే అవకాశం పతాక సన్నివేశాల్లో కానీ దర్శకుడు ఇవ్వలేదు. మాటల రచయితగా దర్శకుడు ఓకే అనిపించి కథనం విషయంలో మాత్రం కాస్త తడబడ్డాడు. విడిపోయిన స్నేహితులు మళ్లీ కలుస్తారా? లేదా? అనే ఆసక్తి ప్రేక్షకుడిలో మొదలవడం.. మహా గురించి తెలిశాక, అభి మళ్లీ ఇండియాకు రావడం.. ఆ తర్వాత వాసుకి, అభికి మేఘనతో పరిచయం, సాన్నిహిత్యం పెరగడంతో కథ మరిన్ని మలుపులు తీసుకుంటుందని ఖచ్చితంగా ఊహిస్తాం. కానీ అదేం జరగదు. ద్వితీయార్థంలో సంభాషణలు, స్నేహం నేపథ్యంలో సన్నివేశాలు చక్కగానే కుదిరాయి. క్లైమాక్స్‌లో అభి-మహాల మధ్య ప్రేమ గురించి వాసు చెప్పే సంగతులు ఫీల్‌ని తీసుకొచ్చాయి. ముఖ్యంగా దర్శకుడు కిషోర్ తిరుమలలోని రచనా నైపుణ్యం అడుగడుగునా కనిపిస్తుంది. స్నేహం గురించి ఆయన రాసిన సంభాషణలు యువతను విశేషంగా ఆకట్టుకుంటాయి. అయితే దర్శకుడు స్నేహ బంధాన్ని మాటల్లో, కొన్ని కీలక సన్నివేశాల్లో అయితే బాగానే చెప్పగలిగాడు. కానీ మిగతా చాలా సీన్లలో అంత ప్రతిభావంతంగా కనెక్ట్ చేయలేకపోయాడు. ముఖ్యంగా అభి - వాసుల మధ్య స్నేహబంధాన్ని గొప్ప స్థాయిలో ఎస్టాబ్లిష్ చేయలేదు. ఒకసారి ప్రేమలో విఫలమైన హీరో రెండోసారి ప్రేమలో పడాలంటే బలమైన కారణాలు, పరిస్థితులు ఖచ్చితంగా అవసరమవుతాయి. కానీ ఇక్కడ మాత్రం హీరో సులభంగా రెండోసారి ప్రేమలో పడిపోవడం కొంత నిరుత్సాహకరంగా అనిపించింది. పెళ్లి తంతు పేరు చెప్పి కొత్త పాత్రలు ఎంటరవడంలో కథ నీరసంగా తయారైంది.
రాక్ బ్యాండ్ మెంబర్ పాత్రలో అభిగా రామ్ సరికొత్త లుక్‌తో ఆకట్టుకున్నాడు. రామ్ సినిమా అంటే సాధారణంగా ఫైట్స్, డ్యాన్సులతో అదరగొడతాడు అనుకుంటారు ప్రేక్షకులు. అయితే వీటికి భిన్నంగా రామ్ వాటితో మెప్పించలేదు. అందుకు కారణం అన్నీ మాంటేజ్ సాంగ్స్ కావడమే. ‘నేను శైలజ’తో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్న అతడు ఈ సినిమాలో తన మార్క్ ఎనర్జీని చూపించాడు. ముఖ్యంగా రాక్‌స్టార్ లుక్‌తో రామ్ బాడీ లాంగ్వే జ్, పెర్ఫార్మెన్స్ యువతకు బాగా కనెక్ట్ అవుతుంది. కొన్ని సార్లు ఎమోషన్ సీన్స్‌లో రామ్ తన నటనతో కంటతడి పెట్టించాడు కూడా. అతడి పాత్ర ముఖ్యంగా రెండు కోణాల్లో సాగుతుంది. ద్వితీయార్థంలో వచ్చే సన్నివేశాలు భావోద్వేగాలు కీలకం. ఆ సన్నివేశాల్లో రామ్ నటన కట్టిపడేస్తుంది. ప్రేమ, స్నేహం గురించి చెప్పే సన్నివేశాల్లో రామ్ నటను మెచ్చుకోవలసిందే.
మహా క్యారెక్టర్‌లో అనుపమా పరమేశ్వరన్ తన చలాకీ నటనతో ఆకట్టుకుంది. తన క్యారెక్టర్ ఫస్ట్ఫా వరకే పరిమితమైనా పాత్రకనుగుణంగా ఒదిగిపోయింది. అందంగా, హుందాగా కనిపించింది. కళ్లతోనే భావాలను పలికిస్తూ మహా పాత్రకు ప్రాణం పోసింది. ఇక వెడ్డింగ్ ప్లానర్ మేఘనగా లావణ్య త్రిపాఠి పాత్రలో నటనకు స్కోపే లేదు. ఏదో వుం ది.. అంటే వుంది అనిపించింది. సెకండాఫ్‌లో వచ్చే ఈ క్యారెక్టర్‌కు ఏ మాత్రం ప్రాధాన్యత లేకుండాపోయింది. లావణ్య ఏ మాత్రం ప్రాధాన్యత లేని క్యారెక్టర్ చేసిందే మిటబ్బా.. అనిపించింది. వాసు పాత్రలో నటించిన శ్రీవిష్ణు నటన ఓకె. ఫ్రెండ్ అంటే ప్రాణమిచ్చే స్నేహితుడిగా, ప్రియురాలు దూరమైన ప్రేమికుడిగా వాసు నటనను కొనసాగించాడు. కాకపోతే సినిమా అంతా ఒకే ఎక్స్‌ప్రెషన్‌తో బోర్ కొట్టించాడు. అభి, వాసుల స్నేహితులుగా రాజ్, కిరిటీ చేసే సందడి ఆకట్టుకుంటుంది. ఇక ప్రియదర్శి తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్వించాడు. ఈ చిత్రంలో అనుకోని అతిథి పాత్ర ఎంట్రీ ఇస్తుంది. రామ్‌తో ప్రేమలో పడిన యువతిగా అనీషా ఆంబ్రోస్ కనిపించింది. ఆమె పాత్రకు పెద్దగా స్కోప్ లేదు. గెస్ట్‌గానే మాయమైంది.
సాంకేతికంగా చూస్తే సాధారణంగా ఫీల్‌గుడ్ ప్రేమకథలకు సంగీతం ప్రాణం. ఈ సినిమాకు ఆ ప్రాణం పోసే బాధ్యతను సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ పూర్తిగా నెరవేర్చాడు. ఎమోషన్ సీన్స్‌లో వచ్చే ట్రెండ్‌మారినా సాంగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలిగించింది. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడు, ఉన్నది ఒక్కటే జిందగీ, లైఫ్ ఈజ్ రెయిన్, వాట్ అమ్మా.. వాటీస్ దిసమ్మా.. అనే పాటలు వినడానికే కాదు, వెండితెరపై కనువిందు చేశాయి. సమీర్‌రెడ్డి కెమెరా ఆకట్టుకుంది. షూట్ చేసిన సహజ లొకేషన్లు ఆహ్లాదకరంగా కనిపించాయి. ఎడిటింగ్ విషయానికొస్తే శ్రీకర ప్రసాద్ ఫస్ట్ఫా లెంగ్త్‌ని కొద్దిగా తగ్గించి ఉండాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగానే వున్నాయి. సో.. మొత్తం మీద ‘ఉన్నది ఒకటే జిందగీ’ని ఫర్వాలేదనిపించే స్థాయికే పరిమిత చేశాడు దర్శకుడు.
-ఎం.డి అబ్దుల్

వసూల్ రాజా ఎవరు?

వసూల్ రాజా ఎవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6cialis pharmacie cialis rapports de stage.

బాక్సాఫీస్‌ను షేక్ చేసి కోట్ల రూపాయల వ్యాపారమే లక్ష్యంగా ప్రస్తుతం టాలీవుడ్ పావులు కదుపుతోంది. తెలుగు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు కొన్ని ప్రత్యేకమైన సీజన్‌లు వున్నాయి. అవి సంక్రాంతి, వేసవి, దసరా, దీపావళి ఇలాంటి సీజన్‌లలో విడుదలయ్యే చిత్రాలకు మినిమం గ్యారంటీతో పాటు, ఆయా చిత్రాలకు బాక్సాఫీస్ వద్ద భలే గిరాకీ ఉంటుంది. అందుకే ఈ సీజన్‌లలో తమ చిత్రాలను విడుదల చేసేందుకు దర్శక, నిర్మాతలు ఎంతో ఉత్సాహం చూపిస్తుంటారు. అంతేకాదు, ఇలాంటి సమయంలో విడుదలయ్యే సినిమాలపై ఇటు పరిశ్రమ, అటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలుంటాయి. ఇలా విడుదలైన సినిమాల్లో ఏదైనా బావుంది అనిపిస్తే చాలు.. ఆ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద కాసులపంటే పండుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. నిర్మాతల జేబులు నిండుతాయి..రికార్డు స్థాయిలో వసూళ్లు రాబడతాయి. ఆ ఆనందం పరిశ్రమలో.. ముఖ్యంగా నిర్మాతల్లో వెల్లివిరిస్తుంది. సాదాసీదా సినిమా కూడా ఇలాంటి సీజన్‌లలో ప్రేక్షకుల ముందుకు వస్తే ఆ చిత్రం గట్టెక్కినట్లేనని సినీ పెద్దలు చెబుతుంటారు. ఇది నిజం కూడా. ఎందుకంటే గతంలో ఈ సీజన్‌లలో విడుదలైన చిత్రాలను పరిశీలిస్తే ఈ విషయమే మనకు స్పష్టమవుతుంది.
సంక్రాంతి, వేసవి, దసరా, దీపావళి సీజన్‌లను టార్గెట్ చేసుకొనే చాలా మంది దర్శక, నిర్మాతలు తమ చిత్రాలను రూపొందిస్తుంటారు. గంపెడాశతో ఇలాంటి సీజన్‌లలో తమ చిత్రాల ద్వారా ప్రేక్షకుల్ని ఆకట్టుకొని, జేబులు నింపుకోవాలని కలలుకంటారు. నిజానికి వాళ్లు అలా ఆలోచించడంలో తప్పులేదు. ఎందుకంటే సినిమా అనేది కోట్ల రూపాయలతో ముడిపడివున్న వినోదం. భారీ స్థాయిలో ఖర్చులు పెట్టి, అంతే భారీగా చిత్రాన్ని తెరకెక్కించినప్పుడు లాభం ఆశించడం ఎవరికైనా సహజమే కదా! ఈ ఏడు కూడా ఈ సీజన్‌లనే టార్గెట్ చేసుకొని అగ్ర తారల సినిమాలు ప్రేక్షకుల తీర్పును కోరుతూ విడుదలయ్యాయి.. బాక్సాఫీస్ వద్ద అనుకున్న రీతిలోనే వసూళ్లు రాబట్టాయి.. ఇంకా ఆ చిత్రాలు వసూళ్ల బాటలోనే పయనిస్తున్నాయి. ఎన్‌టిఆర్ హీరోగా విడుదలైన ‘జై లవకుశ’, మహేష్‌బాబు ‘స్పైడర్’, శర్వానంద్ ‘మహానుభావుడు’ ఈ దసరాకే విడుదలై పండగకు బాక్సాఫీస్ కళను తీసుకువచ్చాయి. ఊహించిన రీతిలోనే నిర్మాతల జేబులు నింపుతున్నాయి. ఇవి ఇంకా థియేటర్లలో వీరవిహారం చేస్తూనే వున్నాయి. ఈ సీజన్‌లనే నమ్ముకొని మరెన్నో చిత్రాలు నిర్మాణంలో ఊపందుకున్నాయి. అయినా.. అవి అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు రాలేకపోయాయి. ఈ ఏడాదికి సంబంధించిన చిత్రాలతో సీజన్లలన్నీ ఇక పూర్తయినట్లే. మరి రాబోయే చిత్రాల పరిస్థితి ఏంటి? సీజన్లు పూర్తయినా కానీ సినిమాలు మాత్రం బాక్సాఫీస్ ముందుకు భారీ స్థాయిలో రావడానికి క్యూకట్టబోతున్నాయి. రాబోయే మూడు నెలల్లోనే కోట్ల వ్యాపారాన్ని టాలీవుడ్ లక్ష్యంగా చేసుకుంది. దీపావళి, క్రిస్‌మస్ పండుగల సమయంలోనూ కొన్ని చిత్రాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. సినిమాల సీజన్‌లు పూర్తయినా రాబోయే మూడు నెలల్లో ఆశలపల్లకిలో పోటాపొటీగా సినిమాలు విడుదలవుతున్నాయి. ఈనెల 13న నాగార్జున, సమంత నటించిన ‘రాజుగారి గది-2’ విడుదలైన సంగతి తెలిసిందే. దీనిని కూడా దీపావళి చిత్రంగానే పరిగణనలోకి తీసుకోవాలి. ఇక రవితేజ హీరోగా ‘రాజా ది గ్రేట్’, రామ్ హీరోగా ‘ఉన్నది ఒకటే జిందగీ..’, గోపీచంద్ ‘ఆక్సిజన్’, రాజశేఖర్ ‘పిఎస్‌వి గరుడవేగ 126.18ఎం’ చిత్రాలతో పాటు, సందీప్‌కిషన్ ‘కేరాఫ్ సూర్య’, మంచు మనోజ్ ‘ఒక్కడు మిగిలాడు’, సాయిధరమ్ ‘జవాన్’, సాయికుమార్ ‘నెక్ట్స్ నువ్వే’, నాగ్ అనే్వష్ ‘ఏంజెల్’, శ్రీవిష్ణు ‘మెంటల్ మదిలో...’, ‘దేవిశ్రీ ప్రసాద్’, ‘గోలీసోడా’, ‘లండన్‌బాబు’లతో పాటు మరో పది సినిమాలు ఈ వరుసలోనే రావడానికి సిద్ధంగా వున్నాయి. ఆక్సిజన్, గరుడవేగ 126.18ఎం చిత్రాలు ఈ అక్టోబర్‌లోనే సందడి చేయనుండగా, నవంబర్‌లో విడుదలకు మరి కొన్ని సినిమాలు రానున్నాయి. ఇక డిసెంబర్ 22న అఖిల్ రెండో చిత్రం ‘హలో’ విడుదలకానుంది. డిసెంబర్ అనేది నాగార్జున కలిసొచ్చిన సెంటిమెంట్. అందుకే తనయుడి చిత్రాన్ని ఈనెలలోనే తీసుకురావడానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రంతో పాటు ఇదే నెలలో నాని ‘ఎంసీఎ, వరుణ్‌తేజ్ ‘తొలిప్రేమ’, మంచు విష్ణు ‘ఆచారి అమెరికా యాత్ర’ థియేటర్లలో సందడి చేయనున్నాయ.
హీరో క్యారెక్టరైజేషన్‌కు తనదైన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీతో వేరియేషన్ చూపించే హీరో మాస్ మహరాజా రవితేజ తాజా చిత్రం ‘రాజా ది గ్రేట్’ ఈనెల 18న విడుదలవుతోంది. ‘పటా స్’, ‘సుప్రీమ్’ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై శిరీష్ నిర్మాతగా ఈ చిత్రం తెరకెక్కింది. దిల్‌రాజుతో ‘్భద్ర’ తర్వాత 13ఏళ్ల గ్యాప్‌తో రవితేజ చేసిన సినిమా ఇది కావడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. దర్శకుడు అనిల్ ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలనుకుంటున్నారు. అలాగే హీరోయిన్ మెహరీన్ కూడా హ్యాట్రిక్ కోసం ఎదురుచూస్తోంది. దిల్ రాజు ఈ ఏడాది ఇప్పటికే నాలుగు సినిమాలతో సక్సెస్‌ను అందుకున్నారు. ఐదో సక్సెస్ కోసం ఈ చిత్రాన్ని చేశారు. సాధారణంగా తెలుగులో సంక్రాంతి, దసరాలకే ప్రేక్షకుల ముందుకు పెద్ద సినిమాలు వస్తుంటాయి. ఇకపై దీపావళికి కూడా పెద్ద సినిమాలు వచ్చేలా చేసింది ‘రాజా ది గ్రేట్’. అత్యంత భారీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అంతే భారీగా విజయాన్ని అందుకోవాలని చూస్తున్నారు.
ఇక గోపీచంద్ హీరోగా వస్తున్న ‘ఆక్సిజన్’ ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏ.ఎం. జ్యోతికృష్ణ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో గోపీచంద్‌కు జోడీగా కథానాయికలు రాశీఖన్నా, అను ఇమ్మాన్యుయేల్ నటించారు. శ్రీ సాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్. ఐశ్యర్య ఈ చిత్రాన్ని నిర్మించారు. హై టెక్నికల్ స్టాండర్ వాల్యూస్‌తో కమర్షియల్ ఎంటర్‌టైనర్‌తో ఈ చిత్రం రూపొందింది. గోపీచంద్ కెరీర్‌లోనే సెనే్సషనల్ చిత్రం అవుతుందన్న గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు నిర్మాత. జగపతిబాబు ఇందులో కీలక పాత్రలో కనిపించనున్నారు. ముంబై, గోవా, సిక్కిం, చెన్నై తదితర ప్రాంతాల్లో మేకింగ్‌లో ఎక్క డా రాజీపడకుండా చిత్రాన్ని రూపొందించారు. జగపతిబాబు, ‘కిక్’ శ్యామ్, అలీ, చంద్రమోహన్, నాగినీడు, బ్రహ్మాజీ, ఆశిష్ విద్యార్థి, షాయాజీషిండే తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
ఎనర్జిటిక్ హీరో రామ్ నటిస్తున్న ‘ఉన్నది ఒకటే జిందగీ..’ చిత్రం కూడా ఈ నెల 27న విడుదలవుతోంది. ఈ చిత్రం కథ విషయానికొస్తే.. స్నేహమేరా ప్రాణం అనుకునే యువకుడు అభిరామ్. ఎత్తుపల్లాలు ఎన్ని ఎదురైనా జీవితం మొత్తం మనతో వుండే వాడే స్నేహితుడంటారు. నలుగురు స్నేహితులతో కలిసి ర్యాక్‌బ్యాండ్ మొదలెడతాడు. ఆ బ్యాండ్‌కి అతనే లీడర్. ఆడుతూ పాడుతూ గడిపే అభిరామ్ జీవితంలోకి అనుకోకుండా ఇద్దరమ్మాయిలు ప్రవేశిస్తారు. వాళ్లతో అభిరామ్‌కి ఉన్న బంధం ఎలాంటిది.. ఇద్దరిలో ఎవరితో ప్రేమలో పడతాడు? అభిరామ్ ప్రేమకథలో స్నేహితుల పాత్ర ఎలాంటిది? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాలంటున్నారు దర్శకుడు. ‘నేను శైలజ’ ఫేమ్ కిశోర్ తిరుమల దర్శకత్వంలో ‘స్రవంతి’ రవికిషోర్, పీఆర్ సినిమాస్ సమర్పణలో స్రవంతి సినిమాటిక్స్ పతాకంపై కృష్ణ చైతన్య నిర్మించిన ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటించారు. రామ్-దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్‌లో వస్తున్న ఐదవ చిత్రమిది. ‘జగడం’, ‘రెడీ’, ‘శివమ్’, ‘నేను శైలజ’ చిత్రాలతో పాటు పాటలూ హిట్టయి మ్యూజికల్ బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి. ‘నేను శైలజ’ తర్వాత రామ్- కిశోర్ తిరుమల- దేవిశ్రీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. అభిరామ్‌కు స్నేహితులుగా శ్రీవిష్ణు, ప్రియదర్శి, కిరీటి, కౌషిక్ నటించారు. ఈ చిత్రంలోని పాత్ర కోసం రామ్ సరికొత్త స్టయిల్‌లోకి మారాడు. అభిరామ్ అనే యువకుడి బాల్యం, కాలేజీ జీవితం, కాలేజీ తర్వాత అతని జీవితాన్ని ఆసక్తికరంగా చూపిస్తున్నట్టు దర్శకుడు చెబుతున్నారు. దీనికి తోడు ఇందులో ప్రేమకథ ఆసక్తికరంగా ఉంటుంది. ప్రేమ, స్నేహం మధ్య ప్రధానంగా సాగుతుంది. రామ్ నటనతోపాటు, కిషోర్ తిరుమల రాసుకొన్న కథ, కథనాలు, ఆయన దర్శకత్వం కొత్త పంథాలో వుంటాయి. ‘నేను శైలజ’ కలయికలో వస్తున్న ఈ చిత్రం ఇంటిల్లిపాదినీ అలరించేలా వుంటుంది అని చిత్ర సమర్పకుడు ‘స్రవంతి’ రవికిషోర్ పేర్కొన్నారు.
టాలీవుడ్‌లో నేషనల్ ఇనె్వస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఎ)పై ఇప్పటి వరకు సినిమాలు రాలేదు. ఓ సిన్సియర్ ఎన్‌ఐఎ ఆఫీసర్ దేశం కోసం, తన కుటుంబం కోసం ఏం చేశాడనే కథాంశంతో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘పిఎస్‌వి గరుడ వేగ 126.18ఎం’. ఈ చిత్రం నవంబర్ 3న విడుదలకానుంది. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలకు పెట్టింది పేరైన యాంగ్రీ యంగ్‌మేన్ డా.రాజశేఖర్ హీరోగా ఈ చిత్రం రూపొందింది. మంచి కథ, పవర్‌ఫుల్ హీరోయిజం, హృదయాన్ని తాకే ఎమోషన్స్, ఉత్కంఠత రేపే సన్నివేశాలతో సినిమాను దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెరకెక్కించారు. ‘మగాడు’ అంత పవర్‌ఫుల్ క్యారెక్టర్‌ను రాజశేఖర్ ప్రజెంట్ చేయాలని దర్శకుడు పడ్డ తపన తెరపై సినిమా రూపంలో కనిపిస్తుంది. జ్యోస్టార్ ఎంటర్ ప్రైజెస్ బ్యానర్‌పై 25 కోట్ల భారీ బడ్జెట్‌తో కోటేశ్వర్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో రాజశేఖర్ సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఇటీవలే విడుదలై సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేసింది. దీనికి మంచి స్పందన లభించింది. ఈ బ్యానర్‌లో వస్తున్న తొలి సినిమా ఇది. సినిమా ప్రారంభం నుంచి ప్రతీ పాత్రను రివీల్ చేస్తూ, దేనికదే ప్రత్యేకం అనేలా అందరిలో ఆసక్తిని కలిగించేలా ప్రమోషన్ ప్లాన్ చేస్తూ వచ్చారు. హీరోయిన్ పూజా కుమార్ ఇందులో గృహిణి పాత్రలో కనిపించనున్నారు. అదిత్ అరుణ్ కీలక పాత్రలో నటించారు. శ్రద్దాదాస్ ఇనె్వస్టిగేటివ్ జర్నలిస్ట్ పాత్రలో కనపడనుంది. కిషోర్ మెయిన్ విలన్‌గా నటించాడు. పోసాని కృష్ణమురళి, రవివర్మ, నాజర్, పృథ్వీ, షాయాజీ షిండే తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. భారీ తారాగణం, సాంకేతిక నిపుణులతో మేకింగ్‌లో ఏ మాత్రం వెనకడుగు వేయకుండా సినిమాను హై టెక్నికల్ వాల్యూస్‌తో రూపొందించారు. ఈ చిత్రంలో ‘డియో..డియో..’ అం టూ సాగే ప్రత్యేక గీతంలో సన్నీ లియోన్ నర్తించింది. సన్నీ నృత్యం చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందట. ఈ ఒక్క పాటకోసమే సన్నీకి యాభై లక్షల రూపాయలు ఇచ్చుకున్నారట.
యువ హీరో సందీప్‌కిషన్ కథానాయకుడిగా ‘కేరాఫ్ సూర్య’ కూడా విడుదలకు సిద్ధమయింది. ఇందులో అతడికి జోడీగా మెహరీన్ నటిస్తోంది. సుశీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సందీప్‌కిషన్ పేరు కామినేని సూర్య. డిగ్రీ పూర్తయింది. కానీ ఉద్యోగం లేదు. అందుకే ఆ ఇంట్లో, వీధిలో, ఆ ఊరిలో అందరికీ లోకువ. ఆ గల్లీలో క్రికెట్ ఆడుకునే పిల్లలు కూడా సూర్య మాట వినరు. ఇంట్లోనూ అదే పరిస్థితి. ఆఖరికి ప్రేమించిన అమ్మాయి కూడా అంతే. ఇంతటి సాధారణమైన జీవితాన్ని గడుపుతున్న సూర్య ఒక్కసారిగా అల్లకల్లోలానికి గురయ్యాడు. అదేంటి? సూర్యకు ఎదురైన సమస్య ఏంటి? అందులోంచి అతడెలా బయటపడ్డాడు? అనేదే ‘కేరాఫ్ సూర్య’. దీనికి చక్రి చిగురిపాటి నిర్మాత.
ఆది, వైభవి, శాండిల్య, రష్మీ, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషిస్తున్న ‘నెక్ట్స్ నువ్వే’ నవంబర్ 3న విడుదలకు సిద్ధమయింది. ఈ చిత్రం ద్వారా ప్రభాకర్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. బన్నీ వాసు నిర్మాత. హోటల్ నేపథ్యంగా సాగే థ్రిల్లర్ ఇది.
శ్రీవిష్ణు, నివేతా పెతురాజ్ జంటగా నటిస్తున్న ‘మెంటల్ మదిలో..’ చిత్రం కూడా విడుదలకు సిద్ధమయింది. ఈ చిత్రం ద్వారా వివేక్ ఆత్రేయ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రాజ్ కందుకూరి నిర్మాత. ఆ కుర్రాడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. బుద్ధిమంతుడు. ఎవరినీ పల్లెత్తు మాట అనడు. కాకపోతే ఒకటే సమస్య. తనకు ఏది కావాలో తేల్చుకోలేడు. రెండు సినిమాలు ఒకసారి వస్తే ఏది చూడాలో తెలియక తికమక పడి రెండు సినిమాల టికెట్లు కొంటాడు. కానీ గందరగోళంతో దేనికి వెళ్లడు. జీవితమంతా అదే కన్ఫ్యూజన్. ఆ గందరగోళం అతడిని అయోమయంలో నెట్టేసింది. చివరికి అతడు ఏం చేశాడు? అన్నదే చిత్రకథ.
క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌తో మరో విభిన్నమైన చిత్రం ‘దేవిశ్రీ ప్రసా ద్’ సైతం విడుదలకు రెడీ అయింది. దేవి, శ్రీ, ప్రసాద్ అనే ముగ్గురు కుర్రాళ్లు. దేవి ఓ ఆటోడ్రైవర్, శ్రీ ఆస్పత్రిలో ఉద్యోగం చేస్తుంటాడు. ప్రసాద్ క్యాంటీన్ నడుపుతుంటాడు. ఈ ముగ్గురు మంచి స్నేహితులు. వీళ్లు లీలా అనే నటిని ఇష్టపడతారు. ఆమెతో పరిచయం పెంచుకుని దగ్గరవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆ లోపే ఆ నటి హత్యకు గురయిందనే విషయం బయటికొస్తుంది. అసలు లీలను ఎవరు హత్య చేశారు? ఆ హత్యతో ఈ ముగ్గురికి సంబంధం ఉందా? లేదా? అనే విషయాలకు తెరరూపం ఈ చిత్రం. శ్రీకిషోర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీగా ధనరాజ్, దేవిగా భూపాల్‌రాజు, ప్రసాద్‌గా మనోజ్‌నందం, లీలగా పూజా రాంచంద్రన్ నటించారు. ఆర్.వి రాజు, ఆక్రోశ్ నిర్మాతలు.
ఇలా అనేక తెలుగు చిత్రాలు రాబోయే మూడు నెలల కాలంలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు క్యూకట్టాయి. సీజన్లు.. పండుగలు.. సెలవులు.. ఇలా ఇవేమీ పట్టించుకోకుండా కొత్త తరహాలో బాక్సాఫీస్ వద్ద హంగామా సృష్టించేందుకు రెడీగా వున్నాయి. ఈ పోటాపోటీగా జరుగుతున్న దీపావళి ధమాకాలో ప్రేక్షకుల ముందుకొస్తున్న చిత్రాల్లో బాక్సాఫీస్ వద్ద వసూల్ రాజా ఎవరు? అని పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ చిత్రాలన్నీ కోట్ల రూపాయలు లక్ష్యంగా ప్రేక్షకుల జేబులు కొల్లగొట్టడానికి సిద్ధంగా వున్నాయి. ఈ కొత్త తరహా టార్గెట్ తెలుగు సినిమాకు ఎలాంటి బాటను చూపుతుందో చూడాల్సిందే.
-ఎం.డి అబ్దుల్

‘జై’ అనాల్సిందే

‘జై’ అనాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6cialis pharmacie cialis rapports de stage.
ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రం ‘జైలవకుశ’. రాశీఖన్నా, నివేదా థామస్ కథానాయికలు. బాబి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్‌రామ్ నిర్మిస్తున్నారు. టీజర్‌లో మూడు పాత్రలకు ఎన్టీఆర్ కనబరచిన వైవిధ్యమైన నటనకు అటు అభిమానులే కాదు ఇటు చిత్ర పరిశ్రమ వర్గాలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నాయి. ఎన్టీఆర్ ఉన్నాడంటే థియేటర్లవద్ద అభిమానులు బారులు తీరుతారు. అలాంటిది ముగ్గురు ఎన్టీఆర్‌లు ఒకేసారి తెరపై కన్పిస్తారంటే ఇంకెంత ఆసక్తిగా వుంటుందో చూడాల్సిందే. ఈనెల 21న ముగ్గురు ఎన్టీఆర్‌లు థియేటర్‌లలో సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా ‘జై లవకుశ’ గురించి ఎన్టీఆర్ తన మనసులోని భావాలను పంచుకున్నారు. అవి ఆయన మాటల్లోనే...
పదాలు వెతుక్కున్నా..
తమ తల్లిదండ్రులకు కానుకగా ఇచ్చేందుకు కళ్యాణ్‌రామ్‌తో కలిసి ‘జై లవకుశ’ తీశాం. అన్నదమ్ముల అనుబంధాన్ని చాటే గొప్ప చిత్రమిది. ఇందులో ‘జై’పాత్ర అంటే నాకెంతో ఇష్టం. ఈ చిత్రం అభిమానులను గర్వపడేలా చేస్తుంది. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో అందరి అభిమానం, వాత్సల్యం నాకు దక్కింది. జన్మనిచ్చిన తల్లిదండ్రుల రుణం ఎన్నటికీ తీర్చుకోలేను. జైలవకుశ చిత్రం గూర్చి మాట్లాడడానికి మొదటిసారి పదాలను వెతుక్కుంటున్నాను. ఎప్పుడూ ఇంత గందరగోళం లేదు. లోపల వున్న ఎమోషన్ వున్న పదాలు రావడంలేదు. దేవుడు చల్లగా చూశాడు. అభిమానులు ప్రోత్సహించారు. నా దర్శకులు ప్రోత్సహించడంవల్లే ఈ స్థాయిలో వున్నా. ఈ మూడింటిలో ఏ ఒక్కటి తక్కువైనా బహుశా జై లవకుశ చిత్రం ఉండేది కాదేమో.
దేవుడే పంపాడు..
‘నాన్నకు ప్రేమతో’ చిత్రం మంచి కథలకు ఆద్యం పోసింది. టెంపర్, జనతాగ్యారేజ్ చిత్రాల తరువాత నేను, అన్న బ్యానర్‌లో ఎలాంటి సినిమా చేద్దామా అని అనుకుంటున్నప్పుడు ఆ మాట వినే దేవుడు బాబీని పంపాడేమో. బాబి కథ చెప్పగానే భయం వేసింది ఈ చిత్రం చేయగలుగుతానో లేదో అని. మా కలలు నెరవేర్చే ఆయుధాలన్నీ కథలో వున్నాయి. కథ విన్న వారంరోజుల తరువాత నాకు అత్యంత ఆప్తుల వద్ద ఈ కథను షేర్ చేసుకున్నా. అద్భుతంగా ఉందన్నారు.
టెక్నీషియన్స్ అదుర్స్
సినిమాకు తొలిసారిగా ఎంపికచేసిన టెక్నీషియన్ దేవిశ్రీ ప్రసాద్. ఆయన ఇచ్చిన పాటల ద్వారా మా మధ్య వున్న బంధం తెలుస్తుంది. చోటా కె నాయుడు సినిమాటోగ్రఫి చేస్తే అందరూ హాయిగా ఉండవచ్చు. ఇంత త్వరగా సినిమా పూర్తికావడానికి ఆయనే కారణం. బాబి పడిన కష్టానికి కోన, చక్రిలు కుడి ఎడమ భుజాల్లా నిలిచారు. బాబిలో వున్న నమ్మకమే ఈ చిత్రం.
వారికే అంకితం
కథానాయికలు రాశీఖన్నా, నివేదా థామస్‌లు చక్కటి సహకారాన్ని అందించారు. మూడు పాత్రలు చేసేటప్పుడు 38 విఎఫ్‌ఎక్స్ షాట్స్ చేయాల్సి వచ్చేది. 76 సార్లు బట్టలు మార్చుకోవాల్సి వచ్చేది. అంత కష్టం అభిమానులకోసమే. ఈ చిత్రం బాగా రావడానికి వారెంతో కష్టపడ్డారు. జైలవకుశ ఒక్క జై చిత్రం కాదు. జై, లవ, కుశ ముగ్గురిదీ. ప్రపంచంలో అన్నదమ్ములందరికీ ఈ చిత్రం అంకితం. ఏ తల్లికైనా ముగ్గురు పిల్లలు పుడితే రామ, లక్ష్మణ, భరతులు అవ్వాలని కోరుకుంటుంది. కానీ దురదృష్టవశాత్తు ఈ తల్లికి పుట్టిన బిడ్డలు రావణ, రామ, లక్ష్మణులు అయ్యారు అంటూ ప్రారంభమయ్యే ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది.
అన్నదమ్ములుగా మా నాన్న పక్కన గర్వంగా నిలబడే సపోర్టును, స్ఫూర్తిని జై లవకుశ ఇస్తుంది. ఈ విషయాన్ని ఖచ్చితంగా చెప్పగలను. జై లవకుశ చిత్రం నాకు కేవలం ఒక్క చిత్రంకాదు. ఎందుకంటే భగవంతుడు ఒక నటుడికి ఇలాంటి అవకాశం ఇవ్వడం చాలా అరుదుగా జరుగుతుంది. బాబి ఎందుకిలాంటి కథ ఎన్నుకున్నాడో తెలియదు.
ఎమోషనల్‌గా..
జనతాగ్యారేజ్ తరువాత ఎలాంటి చిత్రం చేయాలి అన్న సందిగ్ధంలో వుండిపోయాను. మనసుకు నచ్చింది చేయాలా లేక ట్రెండ్‌కు ఫాలో అవుతూ చేయాలా అన్నది అర్థం కాలేదు. బాబి కథ చెప్పడంతోనే నిర్ణయించుకున్నా మనసుకు నచ్చినదే చేయాలని. నా మనసుకు బాగా నచ్చిన చిత్రం ‘జై లవకుశ’. ఎందుకు ఇంత ఆలోచించడం జరిగిందంటే దానికో ఎమోషనల్ పాయింట్ వుంది. అది నేను మా కళ్యాణ్ అన్న, మా పెద్దన్న నందమూరి జానకిరామ్. నేను, కళ్యాణ్ అన్న కలిసి చేసిన ఈ చిత్రం మా తరువాతి తరానికి గుర్తుండిపోతుంది.
నాన్నకు ఓ గిఫ్ట్ ఇవ్వాలని తాపత్రయపడుతున్న సందర్భంలో పుట్టిన కథే ఇది. అన్నదమ్ములు చేద్దామనుకుంటున్న చిత్రానికి అన్నదమ్ముల ఔన్నత్యాన్ని, బంధాన్ని పెంపొందించే చిత్రం దొరకడం నిజంగా భగవంతుడు ఇచ్చిన అరుదైన అవకాశంగా భావిస్తున్నా అని ముగించారు.
-ఎం.డి అబ్దుల్

‘కథ’తోనే కాసుల పంట!

‘కథ’తోనే కాసుల పంట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6cialis pharmacie cialis rapports de stage.
భారతీయ చలనచిత్ర చరిత్రలో ఎన్నో వేల సినిమాలు వచ్చాయి. ప్రేక్షకులను రంజింపజేశాయి. కాసుల వానను కురిపించాయి. కానీ వేళ్లమీద లెక్కబెట్టుకోదగినన్ని సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ వీరుల్లా కాసుల పంట కురిపించి టాప్‌స్టార్ సినిమాలుగా నిలిచాయి. అనేక సినిమాలు వస్తూ పోతూ వున్నా ఆయా చిత్రాల్లో కథ, కథనాలు ఎలా వున్నా ప్రేక్షకులు ఆదరిస్తూనే వున్నారు. కానీ సినిమాపై నిజమైన ప్రేమతో పట్టం కట్టిన చిత్రాలు తక్కువే. ఏ రోజుకారోజు వచ్చే సినిమాలని ఒక్కసారి చూసేసి వదిలేస్తే ఓకె. కానీ కోట్ల రూపాయలు ఆయా చిత్రాలకు నజరానాగా ఇచ్చి సినీ రాజమకుటాన్ని అందించి అభిమానుల ఆదరణను చూరగొన్న పది గొప్ప భారతీయ చలన చిత్రరాజాల గురించి చెప్పుకుంటే ఆహా..అనిపించక మానదు.
కథలో దమ్ముంటే కలెక్షన్ల కాసులు సునామీలా ఆ నిర్మాతను చుట్టుముడతాయి. బాక్సాఫీస్ వసూళ్లు భారీగా జరిగి ఆయా సినిమాల స్టామినాను చూపిస్తాయి. నిర్మాతల జేబులు నిండితేనే ఆ తరువాత మరిన్ని మంచి చిత్రాలకు అంకురార్పణ జరుగుతుంది. మరెందరో సినీ కళాకారులకు ఉపాధి దొరుకుతుంది. థియేటర్‌లో సినిమా ఎన్ని రోజులు నిలిచి ఆడింది అన్న విషయాన్ని బట్టి దాని హిట్ స్థాయిని అంచనా వేసేవారు. ప్రస్తుతం సినిమా తీరు మారిన నేపథ్యంలో వాటి లెక్కలు మారిపోయాయి. ఎన్ని కలెక్షన్లు ఎన్నివారాల్లో వచ్చాయి? ఎన్ని రికార్డులు తిరగరాసింది? అన్నదానిమీదే సినిమా హిట్టా, ఫట్టా చెబుతున్నారు ఇప్పుడు. హీరోల స్టార్‌డమ్‌ను బట్టి కూడా ఫ్లాప్ సినిమా అయినా రికార్డు కలెక్షన్లు వస్తున్నాయని రుజువు అయ్యింది. చిన్న సినిమాగా వచ్చి పెద్ద సినిమాల రికార్డులను బ్రేక్ చేసిన సంఘటనలు కూడా వున్నాయి.
భారతీయ సినిమా పరిశ్రమలో ఇప్పటివరకూ అత్యధిక కలెక్షన్లు కొల్లగొట్టిన చిత్రాలు చాలా ఉన్నా, వాటికి పది స్థానాలు ఇస్తున్నారు. పరిశ్రమ రికార్డులను తిరగరాసే సత్తా తెలుగు సినిమాకూ వుందని ‘బాహుబలి’ రుజువు చేసింది. ప్రభాస్ కథానాయకుడిగా ఎస్.ఎస్.రాజవౌళి దర్శకత్వంలో రూపొందిన ‘బాహుబలి-2’ తెలుగు సినిమా కలెక్షన్ల ఉద్ధృతిని ప్రపంచ వ్యాప్తంగా చుట్టివచ్చింది. ఇప్పటివరకూ అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్-10 చిత్రాల విషయానికి వస్తే, ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
1.దంగల్ (1862 కోట్లు), 2. బాహుబలి-2 (1706 కోట్లు), 3. పి.కె (792 కోట్లు), 4. బాహుబలి (650 కోట్లు), 5. భజరంగీ భాయిజాన్ (626 కోట్లు), 6. ధూమ్ -3 (585 కోట్లు), 7. సుల్తాన్ (584 కోట్లు), 8. కబాలి (477 కోట్లు), 9. ప్రేమ్త్రన్ ధన్ పాయో (432 కోట్లు), 10. చెన్నై ఎక్స్‌ప్రెస్ (423 కోట్లు). ఇలా టాప్ టెన్‌లో వున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ సునామీ కలెక్షన్లు సృష్టించడంలో ఆయా చిత్రాలలో ఉన్న విషయం ఏంటి? ఊహించినదానికంటే నిర్మాతలకు అత్యధిక వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టించడం వెనుక కారణమేమిటి? సినిమాలు ఇలాంటి రికార్డులను తిరగరాసి, నిర్మాతలకు కొత్త ఉత్సాహాన్ని కలిగించడం వెనుక కారణం? విశ్వవ్యాప్తంగా భారతీయ సినిమా అంటే ఇదీ.. అని ఎలుగెత్తి చాటిన ఈ చిత్రాలను గురించి విశే్లషిస్తే ‘కథే ప్రధాన కథనం’ అని రూఢీగా చెప్పచ్చు. ఆయా చిత్రాల కథలను గమనిస్తే...
దంగల్: ఏ పాత్ర చేసినా మిస్టర్ పర్‌ఫెక్షన్‌గా పేరొందిన అమీర్‌ఖాన్ ఇండియన్ రెజ్లర్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత మహావీర్ సింగ్ ఫోగట్ జీవిత చరిత్ర నేపథ్యంగా ‘దంగల్’ చిత్రాన్ని రూపొందించారు. దంగల్ అంటే మల్లయుద్ధం అని అర్థం. మహిళలు రెజ్లింగ్ క్రీడవైపు రావడానికే భయపడే రోజుల్లో ఫోగట్ తన ఇద్దరు కుమార్తెలను దేశం గర్వించదగ్గ మహిళా రెజ్లర్లుగా ఎలా తీర్చిదిద్దారు అనేదే ప్రధాన కథనం. నితీష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఓ మారుమూల గ్రామానికి చెందిన సామాన్యమైన మల్లయుద్ధ వీరుడు భారతదేశానికి బంగారు పతకాలు సాధించే కలను కుమారులవల్ల కాకపోయినా కుమార్తెలతో సాకారం చేసుకున్న కథే ఇక్కడ ప్రధానాంశం. కుమారుడు కలిగితే రెజ్లర్‌గా తీర్చిదిద్దాలన్న ఫోగట్ ఆశయం నెరవేరదు. నాలుగుసార్లు కుమార్తెలే జన్మించడంతో నిరాశలో వున్న ఫోగట్‌కు మెరుపులాంటి ఆలోచన వస్తుంది. కుమారులే కాదు కుమార్తెలను కూడా రెజ్లరుగా తీర్చిదిద్దవచ్చునన్న ఆలోచనతో కఠోర శిక్షణతో తన కలను నెరవేర్చుకుంటాడు.
బాహుబలి-2: ప్రభాస్ బాహుబలిగా నటించిన రెండవ చిత్రం 1706 కోట్లు సాధించడం వెనుక కథ ఏమిటి అని ప్రేక్షకుల్లో ఉత్కంఠత రేగింది. తొలి భాగం సంచలన విజయం సాధించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. బాహుబలి సినిమాకు కొనసాగింపుగా ఈ సినిమా మొదలవుతుంది. భారీ బడ్జెట్‌తో, హైటెక్నికల్ స్టాండర్డ్స్‌తో రూపొందించిన ఈ సినిమా కథాపరంగా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. నాలుగు భాషల్లో విడుదలై అత్యధిక వసూళ్లను సాధించింది. శివగామిగా రమ్యకృష్ణ హైలెట్‌గా నిలిచింది. ప్రతి 15 నిమిషాలకు ప్రేక్షకులకు కావలసిన మసాలా దినుసులను కూర్చి రాజవౌళి ఈ సినిమా రూపొందించాడు. సినిమాలో వచ్చే ముఖ్యమైన సన్నివేశాలతోపాటుగా యుద్ధ నేపథ్యంలో వచ్చిన ప్రతి విజువల్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కొత్త ప్రపంచాన్ని చూపించే ప్రయత్నం చేసిన బాహుబలి-2 చిత్రం పగ, ప్రతీకారం నేపథ్యంలో వచ్చినా కొత్త స్టయిల్‌లో ప్రెజెంటేషన్ చేయడంతో ప్రేక్షకులకు నచ్చింది. బాహుబలి-2 ఇంత విజయవంతం అవడానికి ప్రధాన కారణం బహుబలి చిత్రంలో చర్చించిన కథే. బాహుబలి.. ఎక్కడ చూసినా ఏ నోట విన్నా ఇదే పేరు. అందరూ ఓ సినిమా టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు. భారతీయ చలనచిత్ర దశ దిశని మార్చేలా కొన్ని వందల మంది రెండున్నరేళ్లు కష్టపడి అత్యంత భారీ బడ్జెట్‌తో, హైటెక్నికల్ స్టాండర్డ్స్‌తో, భారీ సెట్టింగులతో మనముందుకు తీసుకువచ్చిన టాలీవుడ్ జక్కన్న ఎస్.ఎస్.రాజవౌళి కలల ప్రాజెక్టు ఇది. మొదటి సినిమా (బాహుబలి-650 కోట్లు)లో వేసిన థ్రెడ్ రెండో సినిమాలో ఎలా ముడివిప్పారు అన్నదానే్న ప్రధానంగా ప్రేక్షకులు ఆలోచించారు. అందుకే ఈ రెండు చిత్రాలకు కాసుల వర్షం కురిసింది.
పి.కె: అమీర్‌ఖాన్, అనుష్కశర్మ ప్రధాన తారాగణంగా వినోద్‌చోప్రా ఫిలింస్ పతాకంపై రాజ్‌కుమార్ హిరాణి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం భారతీయ చలనచిత్ర చరిత్రలో పరిచయం కాని ఓ సరికొత్త జోనర్‌తో రూపొందింది. గ్రహాంతరవాసి భారతీయ చిత్రాల్లో కనిపించిన దాఖలాల కథలు ఎక్కడా లేవు. పాత చిత్రాల్లో యమలోకం నుంచి వచ్చిన చనిపోయిన మనుషుల కథనాలతో కొన్ని చిత్రాలు వచ్చాయి. కానీ ఇది దానికి పూర్తి విరుద్ధంగా వుంటుంది. వేరే గ్రహం నుండి వచ్చిన వ్యక్తి, ఇక్కడి పరిస్థితులకు తగ్గట్టుగా తనను తాను ఎలా మార్చుకున్నాడు అన్న టాపిక్‌లోనే వైవిధ్యాన్ని నింపే ప్రయత్నం చేశారు దర్శక నిర్మాతలు. భూగ్రహంపై మనుషుల మనస్తత్వాలు వారి ఆలోచనా విధానాలను సున్నితంగా విమర్శించే ప్రయత్నం చేసి నవ్వించే ప్రయత్నం చేయడంతో ఈ సినిమా విజయవంతమైంది. మనుషుల ఆలోచనా విధానాలు ఎలా వుంటాయి అన్న అంశాన్ని తీసుకుని హృదయానికి హత్తుకునేలా కథను తీర్చిదిద్దడం ఈ సినిమాకు ఓ ప్లస్.
భజరంగీ భాయ్‌జాన్: కబీర్‌ఖాన్ దర్శకత్వంలో సల్మాన్‌ఖాన్ కథానాయకుడిగా రూపొందిన ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎలిమెంట్స్‌తో భావోద్వేగాల సమాహారంగా రూపొందించిన ఈ చిత్రంలో కొత్త సల్మాన్‌ఖాన్ కనిపిస్తాడు. బాహుబలి కథా రచయిత విజయేంద్రప్రసాదే ఈ చిత్రానికి కథ అందించారు. రెండు మతాల భావోద్వేగాలు, దేశ సరిహద్దుల్లో పరిస్థితిని సమీక్షిస్తూ సాగే ఈ చిత్రంలోని కథ కథనాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. పవన్‌కుమార్ చతుర్వేదిగా సల్మాన్‌ఖాన్ నటనతోపాటుగా రెండు దేశాల వారధిగా రూపుదిద్దిన ప్రతి సన్నివేశం కథకు అనుగుణంగా సాగడంతో ఈ చిత్రం ఆదరణ పొందింది.
ధూమ్-3: విజయ్‌కృష్ణ ఆచార్య దర్శకత్వంలో వచ్చిన అమీర్‌ఖాన్ అభిషేక్‌బచ్చన్, కత్రినాకైఫ్, ఉదయ్ చోప్రా నటించిన ‘్ధమ్-3’ ప్రేక్షకులకు పరిచయమైన కథే. అయినాకానీ ఒకటీ రెండు చిత్రాలకన్నా మూడో చిత్రం దుమ్మురేపేసింది. కలెక్షన్ల పరంగా టాప్-10 చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఎసిపి జైగా అభిషేక్‌బచ్చన్, అలీగా ఉదయ్‌చోప్రా, సహేర్ పాత్రలో అమీర్‌ఖాన్ ఆకట్టుకున్నారు. అమీర్‌ఖాన్ చేసిన రెండు పాత్రలు ఆ సినిమాకు హైలెట్.
సుల్తాన్: రెజ్లర్ అర్ఫాగా అనుష్క శర్మ నటన హైలెట్‌గా నిలిచిన ఈ చిత్రంలో సల్మాన్‌ఖాన్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలోని కథ ప్రేక్షకులను కట్టిపడేసింది.
కబాలి: పారంజిత్ దర్శకత్వంలో రూపొందిన ‘కబాలి’ చిత్రం ఊహకు అందని విధంగా అంచనాలను సృష్టించింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో వెనుకపడినా అద్భుతమైన కథ కథనాలతో కలెక్షన్ల సునామీ సృష్టించింది. రియలిస్టిక్ షూటింగ్‌తో తెరకెక్కిన ఈ సినిమా 477 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ‘కబాలి’ పాత్రలో రజనీకాంత్, అతడి భార్య కుందన్‌వల్లి పాత్రలో రాధికా ఆప్టే నటించారు. సౌత్ ఇండియన్ సినీ అభిమానులంతా ఈ పేరును కలవరించినంతగా మరే పేరును కలవరించలేదేమో.
ప్రేమ్త్రన్ ధన్‌పాయో: సల్మాన్‌ఖాన్, సోనమ్‌కపూర్ జంటగా నటించిన ఈ చిత్రం అత్యధిక వసూళ్లను సాధించింది. సూరజ్ ఆర్ బర్జాతియా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో యువరాజ్ విజయ్‌గా సల్మాన్‌ఖాన్, మైథిలిగా సోనమ్‌కపూర్ నటించారు. సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్‌తోపాటుగా ప్రేక్షకులను ఆకట్టుకునే కథ వుండడంతో ఈ సినిమా విజయవంతమైంది.
చెన్నైఎక్స్‌ప్రెస్: షారూక్‌ఖాన్, దీపికా పదుకొనె జంటగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను నవ్విస్తూనే సాగడంతో కలెక్షన్లు రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం కలెక్షన్ల చరిత్రను తిరగరాసింది. రోహిత్‌శెట్టి దర్శకత్వంలో వినోదాత్మకంగా సాగి ఉత్తర దక్షిణ ధృవాల మధ్య వున్న తేడాలను భారతదేశంలో ఏకసూత్రత, ప్రజల్లో ఎలా అంతర్గతంగా వున్నది అన్న అంశాన్ని ఈ చిత్రంలో చర్చించడంతో ప్రేక్షకులకు అభిమాన పాత్రమైంది.
మీరు ఏ నటులను పెడతారో మాకవసరంలేదు. ఎలా తీర్చిదిద్దుతారో చూడం- కానీ సినిమాలో ప్రధానంగా కథే కావాలి. కథను అనుసంధానించి మీరు ఎలా సినిమాను చిత్రీకరించినా ఎన్ని ట్విస్టులు పెట్టినా, ఎన్ని పాటలున్నా, పాటలు లేకపోయినా, ఫైట్స్ గట్రాలు వున్నా లేకపోయినా సినిమా బాగుంటే మాత్రం ఆదరిస్తామంటున్నారు ప్రేక్షకులు. కానీ కథ ముడివస్తువు దొరక్క హాలీవుడ్ సినిమాలను చూసి సన్నివేశాలు పేర్చుకుంటూ రూపొందించే చిత్రాలన్నీ కథ కంచికె అన్నట్లు వెళ్లిపోతున్నాయి. సరికొత్త జోనర్‌లో మీరు కథ రాయవద్దు. పాత జోనర్‌లోనే కొత్తగా కథ రాయండి అని ప్రేక్షకుడు పరిశ్రమకు చెబుతూనే వున్నాడు. విన్నవాళ్లకు కాసుల వర్షం, విని విననట్లు వుండేవాళ్లు నష్టాల బాట పడుతున్నారు. కనుక గమనించడయ్యా! *
-ఎం.డి అబ్దుల్

‘మెరుపు’ తీగలు


‘మెరుపు’ తీగలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6cialis pharmacie cialis rapports de stage.
కథానాయకులతో పోలిస్తే మా పాత్రలకు ప్రాధాన్యమే దక్కడం లేదంటూ నిరుత్సాహాన్ని వ్యక్తం చేసేవారు ఇది వరకు కథానాయికలు. కానీ ఇటీవల వాళ్ల స్వరం మారుతోంది. మాకూ మంచి రోజులొచ్చాయని చెబుతున్న మెరుపుతీగలు ఇప్పుడు చాలా మందే కనిపిస్తున్నారు. తెలుగు సినిమాలో కథానాయిక పాత్రల గురించి తొలినాళ్లలో విన్నది ఒక రకం. ఇప్పుడు చూస్తున్నది మరో రకం. వారి పాత్రలకి ప్రాధాన్యం పెరుగుతుంది. ఇదో మంచి మార్పు. ఇది వరకు కథానాయిక అంటే గ్లామర్ కోణంలో చూసేవారు. కానీ ఇప్పుడు ఆ విషయాన్ని దాటి ఆలోచిస్తూ పాత్రల్ని తీర్చిదిద్దుతున్నారు. టాలీవుడ్‌లో ఇటీవల కాలంలో నాయికా ప్రాధాన్య చిత్రాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. బాలీవుడ్‌లోనూ ‘అకిరా’, ‘మేరీ కోమ్’లాంటి సినిమాలు మంచి వసూళ్లు, పేరు సంపాదించుకున్నాయి. దక్షిణాదిలోనూ ఈ తరహా సినిమాలు
రూపొందుతున్నాయి. కాలం మారుతోంది అనడానికి ఇదే నిదర్శనం.
నిమా ఓ గ్లామర్ ప్రపంచం. ఎప్పుడూ అందం, ధగధగలు, రంగుల గురించే మాట్లాడుతుంటారు ప్రేక్షకులు. అయితే ఏ సినిమా చూడాలి? ఏది చూడకూడదనే విషయంపై వారికి కొన్ని లెక్కలుంటాయి. అదే తరహాలోనే ఏ సినిమా చేయాలో, ఏది చేయకూడదో అనే విషయంపై కూడా కథానాయికల పాత్రలు పోషించే ‘మెరుపు’ తీగలూ కొన్ని లెక్కలేసుకొని నిర్ణయాలు తీసుకొంటుంటారు. ఏది ఎప్పుడు చేయాలో కూడా వాళ్ల దగ్గర కొన్ని ప్రణాళికలుంటాయి. తొలి అడుగులో కాదు కానీ.. ఒక్కసారి స్టార్‌గా గుర్తింపు తెచ్చుకొన్నాక కథానాయికల ప్రణాళికలు పూర్తిగా మారిపోతుంటాయి. కథ ఇలా ఉంటేనే ఒప్పుకోవాలని, చేసే క్యారెక్టర్‌కు ఇంత ప్రాధాన్యం ఉండాల్సిందే అనీ, పారితోషికం విషయంలోనూ అస్సలు తగ్గకూడదనీ.. ఇలా బోలెడన్ని లెక్కలు వేసుకొని అందుకు తగినట్టుగా తమ కెరీర్‌లో ప్రయాణం సాగిస్తుంటారు. ప్రతీసారీ తమలోని నటిని సంతృప్తిపరిచే పాత్రని చేయలేరు. చేసేందుకు సిద్ధంగానే వున్నా, ఆ తరహా పాత్రలు వారి దగ్గరికి రాకపోవచ్చు. అలాగే ప్రతీసారీ ప్రేక్షకుల్ని తమ నటనతో ఆకట్టుకొని, వారిని మెప్పించే పాత్రలూ వారి నుంచి రాలేవు. చేసేటప్పుడే ఏ క్యారెక్టర్ ప్రేక్షకులపై ఎంతటి ప్రభావం చూపుతుందో ముందే తెలిసిపోతుంటుంది. కొన్ని సార్లు పాత్రలకంటే కథలు ఎక్కువగా ప్రేక్షకులపై ప్రభావం చూపుతుంటాయి. అందుకే పాత్రతో సంబంధం లేకుండా అన్ని సినిమాల్నీ చిత్తశుద్ధితో చేయాలి. ఒక మంచి కథ ప్రేక్షకులకు చేరువైందంటే అందులో చిన్న పాత్ర చేసినా సరే, గొప్ప గుర్తింపు వస్తుంది. ఆ ఆశతోనే మొత్తం కథని పరిగణనలోకి తీసుకొని సినిమాల్ని ఎంపిక చేసుకుంటుంటారు కథానాయికలు.
నటనకి ప్రాధాన్యమున్న పాత్రలతో వారికి లభించే గుర్తింపే వేరు. అందులో మారోమాటకి తావులేదు. అయితే ప్రతీసారీ కథానాయికకి అలాంటి పాత్రలు దొరకడం కష్టం. భారతీయ సినిమాల్లో కథానాయిక పాత్రలే కీలకం కాబట్టి నాయికకి తెరపై లభించే ప్రాధాన్యం తక్కువే. అలాగని నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఆ కాసింత పరిధిలోనే ప్రేక్షకుల్ని రక్తికట్టించొచ్చు. నటనకి ప్రాధాన్యమున్న పాత్రలతో ఎంత పేరు తెచ్చుకోవచ్చో, ఫక్తు వాణిజ్య చిత్రాలలోని పాత్రలతోనూ అదే స్థాయిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవచ్చు. బలమైన పాత్ర దొరికినప్పుడు ఎవరైనా కష్టపడతారు. కానీ వాణిజ్య చిత్రాల్లోని పాత్రలతో ప్రేక్షకులపై ముద్ర వేయడమే ఓ సవాల్. ఆ కిటుకు పట్టేశారంటే ఎలాంటి పాత్రతోనైనా ప్రేక్షకుల్ని ప్రభావితం చేయొచ్చు. కథానాయికలకు యువతరంలో ఉండే ఆదరణ అంతా ఇంతా కాదు. అబ్బాయిలైతే గదుల్లో పోస్టర్లేకాదు, గుండె ల్లో గుడులూ కట్టేస్తుంటారు. తెరపైకి రాకముందు కూడా కొంతమంది కథానాయికలకు ఈ తరహా అభిమానుల తాకిడి ఎక్కువగా ఉండేది. కథానాయకుల్లేని చిత్రాలున్నాయేమో గానీ, నాయికలులేని సినిమాల్లేవు. కథకు అవసరం ఉన్నా, లేకపోయినా.. పాటలకే పరిమితం చేసినా, కథానాయికను పెట్టుకోవాల్సిందే. ఆ క్యారెక్టర్ ద్వారా గ్లామర్ చిలికించాల్సిందే. సినిమాకు హీరో ఒక్కరే కావొచ్చు. హీరోయిన్లు మాత్రం ఇద్దరు, ముగ్గురు ఉండొచ్చు. అందుకే కథానాయికలకు అంత డిమాండ్. కథానాయికల చూపు నటనకి ప్రాధాన్యమున్న పాత్రలపైనే ఉంటుంది. మంచి నటి అనిపించుకొనే ఆస్కారం అలాంటి పాత్రలతోనే లభిస్తుందనేది వాళ్ల నమ్మకం. అందుకే సాహసాలు చేయడంలోనూ ఈ భామలు వెనకడుగు వేయడంలేదు. ముఖ్యంగా నవతరం కథానాయికలు ఈ విషయంలో మరింత ముందుంటున్నారు. నలుగురు నడిచిన దారిలో అని కాకుండా, మనమే ఒక దారిని సృష్టిద్దాం అంటూ ధైర్యంగా నిర్ణయాలు తీసుకొంటున్నారు. విభిన్నమైన పాత్రలొస్తే ఏం చేయడానికైనా సిద్ధమే అంటున్నారు. సాహసాలతోనే అద్భుతా లు సాధ్యమవుతాయని వారి నమ్మకం.
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తమ నటనతో అందర్నీ మెప్పిస్తూ, కెరీర్‌లో ఎదురులేకుండా అడుగులు వేస్తూ ప్రేక్షకుల్ని మురిపిస్తున్న కథానాయికలు కొందరున్నారు. వారిలో అనుష్క, కాజల్ అగర్వాల్, తమన్నా, సమంతాతో పాటు నవతరం బ్యూటీలైన రకుల్ ప్రీత్‌సింగ్, రాశీఖన్నా, కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్, నివేదా థామస్, అను ఇమ్మాన్యుయల్, సాయి పల్లవి లాంటి మురిపిస్తున్న ‘మెరుపు’తీగల గురించి ఒక్కసారి విశే్లషిస్తే...
అనుష్క: ఈ బ్యూటీ ఇప్పటికీ అగ్ర కథానాయికే. దక్షిణాదిలో కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రం అనగానే అందరికీ అనుష్కనే గుర్తుకొస్తుంది. ఆమెపై కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు నిర్మాతలు సిద్ధమవుతున్నారు. కథానాయిక నేపథ్యంలో ఓ కథ తయారయి తే మొదటి ఎంపిక కచ్చితంగా అనుష్కనే. కథానాయకులకు దీటైన పాత్రలతో ఆమె తెరపై సందడి చేస్తోంది. ఆట పాటలతో పూర్తయ్యే పాత్రలకంటే చెమటోడ్చి చేయాల్సిన పాత్రలవైపే అనుష్క మొగ్గు చూపుతోంది. ‘బాహుబలి’, ‘బాహుబలి-2’ చిత్రాలతో భారీ విజయాల్ని సొంతం చేసుకున్న ఈ భామ ఇప్పుడు కొత్త చిత్రాలతో బిజీగానే వుంది. 2005లో ‘సూపర్’తో ప్రయాణమైన టాలీవుడ్ జైత్రయాత్ర విక్రమార్కుడు, లక్ష్యం, శౌర్యం, చింతకాయల రవి, ఒక్కమగాడు, అరుంధతి, రుద్రమదేవి, బిల్లా, వేదం, పంచాక్షరి, ఖలేజా, చంద్రముఖి, రగడ, కేడి, తకిట తకిట, ఢమరుకం, మిర్చి, సోగ్గాడే చిన్ని నాయనా, ఊపిరి (స్పెషల్ అప్పీయరెన్స్) లాంటి చిత్రాల్లో నటించిన అను ష్క తాజాగా నాగార్జునతో ‘నమో వేంకటేశాయ’లో చేస్తోంది. ‘ఎప్పటికైనా కథే హీరో. నేను సినిమాను సినిమాగానే చూస్తాను తప్ప ఒక పాత్ర కోణంలో చూడను. కథ బాగుందనిపిస్తే అందు లో చిన్న పాత్రలోనైనా నటించాలనిపిస్తుంది. పాత్ర ప్రాధాన్యాన్ని తూకమేసుకొని చేసిన సినిమా నా కెరీర్‌లో ఒక్కటీ లేదు. కథలతో కదిలించిన చిత్రాల్నే చేశా’నని చెబుతోంది అనుష్క.
కాజల్ అగర్వాల్: రామ్‌చరణ్ హీరోగా వచ్చిన ‘మగధీర’తో తెలుగు సినిమాల్లో యువరాణి అంటే కాజల్ అని పేరుతెచ్చుకుంది. తరగని అందంతో ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ పరిశ్రమకొచ్చి పదేళ్లు దాటిపోయాయి. ఇంకా ‘చందమామ’గానే పిలిపించుకుంటోంది. దక్షిణాదిలో అనుభవమున్న ఓ కీలక కథానాయికగా గుర్తింపు పొందిన ఈమె ఎప్పుడూ సినిమా ఫలితాల్ని అంచనా వేయదు. తేజ లక్ష్మీ కళ్యాణం, చందమామ, మగధీర, డార్లింగ్, బృందావనం, మిస్టర్ పర్‌ఫెక్ట్, బిజినెస్‌మ్యాన్, నాయక్, బాద్‌షా, గోవిందుడు అందరివాడే, టెంపర్, ఖైదీ నెం.150 లాంటి చిత్రాల్లో నటించిన కాజల్ తాజాగా కళ్యాణ్‌రామ్‌తో ఓ చిత్రంతో పాటు రానా హీరోగా ‘నేనే రాజు నేనే మంత్రి’లో చేస్తోంది.
తమన్నా: ‘హ్యాపీడేస్’ నుంచి ఈ బ్యూటీ కెరీర్ ఆగకుండా పరుగులు పెడుతూనే వచ్చింది. గత పదేళ్లుగా దక్షిణాది చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్న ఓ అగ్ర కథానాయిక ఈమె. తనదైన నటనతో ఎన్నో పాత్రలకి ప్రాణం పోసింది. చిత్రసీమలో ప్రణాళికలేవీ పనిచేయవని చెబుతూనే, ఒక పద్ధతి ప్రకారం తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. అదృష్టం కొద్దీ ఆమెకు ఎప్పటికప్పుడు విభిన్నమైన పాత్రలు చేసే అవకాశం లభిస్తూనే వుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను నిలుపుకుంటోంది. ఈ అమ్మడి కెరీర్ కాస్త విచిత్రంగానే కనిపిస్తుంది. ఇక్కడి అమ్మాయి కాదు, కానీ తెలుగు కథానాయికగా చలామణీ అవుతోంది. పనిలోపనిగా తమిళంలోనూ విజయాల్ని సొంతం చేసుకొంది. సొంతభాషలో చేసిన ఏ ప్రయత్నమూ సఫలం కాలేదు. బాలీవుడ్‌లో చేసిన సినిమాలన్నీ నిరాశపరిచాయి. ‘నా దగ్గరకొచ్చిన పాత్రల్ని ఉత్తమంగా చేయడానికి ప్రయత్నిస్తాను తప్ప..నాకు నచ్చిన పాత్రలు రాలేదే అంటూ నిందిస్తూ కూర్చోలేను’ అం టోంది ఈ బ్యూటీ. ‘హ్యాపీడేస్’ తర్వాత 100% లవ్, రచ్చ, తడాఖా, బాహుబలి, బెంగాల్ టైగర్, ఊపిరి, బాహుబలి-2 చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు చేసిన తమన్నా ఇప్పటికీ తన కెరీర్‌ను బిజీగానే కొనసాగిస్తుండటం విశేషం.
సమంత: నటనలోనే కాదు.. అందంతోనూ మాయ చేస్తుంది సమంత. తెలుగు, తమిళంతో పాటు హిందీ చిత్రాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ ఇటీవలే నాగచైతన్యతో కలిసి పెళ్లి పీటలెక్కింది. త్వరలో ఈమె ‘రాజుగారి గది-2’లో సందడి చేయబోతోంది. ఇందులో ఆత్మగా కనిపించబోతోంది. రామ్‌చరణ్‌తో కలిసి ‘రంగస్థలం’ లోనూ నటిస్తోంది. పెళ్లి తర్వాత కూడా తాను నటిస్తానని ఇది వరకే స్పష్టం చేసింది. 2010లో వచ్చిన ‘ఏ మాయ చేసావే’తో టాలీవుడ్‌లో మెరిసిన ఈ అమ్మడు అటు తర్వా త బృందావనం, దూకుడు, ఈగ, సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు, అత్తారింటికి దారేది?, రామయ్యా వస్తావయ్యా, అల్లుడు శీను, రభస, సన్నాఫ్ సత్యమూర్తి, బ్రహ్మోత్సవం, అ ఆ, జనతాగ్యారేజ్ తదితర చిత్రాల్లో మెరిసింది. తాజాగా నటిస్తున్న ‘రాజుగారి గది-2’, ‘రంగుస్థలం-1985’, ‘మహంతి’ చిత్రాలతో పాటు మరికొన్ని నిర్మాణంలో వున్నాయి. ‘నా సినీ ప్రయాణంలో ఇప్పటి వరకు ప్రముఖ దర్శకులతో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. నాలోని నటిని ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో ఆవిష్కరించారు. నేను చేసే ప్రతి పాత్ర నాకు ఉత్తమంగానే అనిపిస్తుంది. పెళ్లి తర్వాత పెనుమార్పులు చేసుకుంటాయని అనుకోవడం లేదు. పెళ్లి తర్వాత కూడా నేను నాలాగే వుంటా. కెరీర్ పరంగా చైతూ మొదలుకొని కుటుంబ సభ్యుల వరకూ అందరూ కూడా ప్రోత్సహిస్తున్నారు. అంతకంటే ఏం కావాలి? కెరీర్ పరంగా నేను చాలా అదృష్టవంతురాలిని. కథానాయికలకు ఎప్పుడోకానీ మంచి పాత్రలు లభించవు. అలాంటి పరిస్థితుల్లో నాకు పలు చిత్రాల్లో ప్రాధాన్యమున్న పాత్రలు చేసే అవకాశం లభించింది. నాకంటే ప్రతిభావంతులు, నాకంటే అందమైన అమ్మాయిలు ఉన్నప్పటికీ ఆ తరహా పాత్రలు చేసే అవకాశం నాకు లభించడం అదృష్టం కాక మరేవౌతుంది?’’అని చెబుతోంది. సో..మరికొన్నాళ్లపాటు ఆమె సందడిని తెరపై ఆస్వాదించొచ్చన్నమాట.
రకుల్ ప్రీత్‌సింగ్: రకుల్ ప్రీత్‌సింగ్ సినిమా సినిమాకీ తన గ్లామర్ పెంచుకుంటూనే ఉంది. కొత్త కొత్తగా ముస్తాబవుతూ ఆకట్టుకుంటోంది. సినిమా లు, గ్లామర్, క్రేజ్.. ఏదో ఒక రోజు కనుమరుగవుతాయన్న నిజాన్ని గుర్తించినట్టే ఉంది. కాబట్టి వచ్చిన ఆఫర్లను వరుసగా చేజిక్కించుకుంటూ యమబిజీగానే వుంది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో గ్లామర్‌ని చిందిస్తున్న ఈ బ్యూటీ మోడలింగ్ నుంచి వెండితెరపై వికసించిన ఢిల్లీభామ. 2009లో వచ్చిన ‘గిల్లీ’ రకుల్ నటించిన తొలి కన్నడ చిత్రం. 2011లో తెలుగునాట ‘కెరటం’లో సంగీతగా పరిచయమైంది. 2013లో ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’లో ప్రార్ధన పాత్రను పోషించింది. 2014లో ‘రఫ్’లో నందుగా, అదే సంవత్సరం ‘లౌక్యం’లో చంద్రకళగా, ‘కరెంట్‌తీగ’లో కవితగా ఆడిపాడిన ఈ ముద్దుగుమ్మ 2015లో ‘పండగ చేస్కో’లో దివ్యగా, ‘కిక్-2’లో చైత్రగా, ‘బ్రూస్‌లీ’లో రియగా కనువిందు చేసింది. 2016లో వచ్చిన ‘నాన్నకు ప్రేమతో..’లో దివ్యాంకగా నటించి ఫిలింఫేర్ అవార్డును కూడా చేజిక్కించుకుంది. అదే ఏడాది వచ్చిన ‘సరైనోడు’లో మహాలక్ష్మీగా, ‘్ధృవ’లో లషికగా, ‘విన్నర్’లో సితారగా ఓ వెలుగు వెలిగింది. ‘జయ జానకి నాయక’లో జానకిగా, తాజాగా వచ్చిన మహేష్‌బాబు ‘స్పైడర్’లో ప్రియగా ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకుంది. తను నటించిన సినిమా హిట్టయితే అదంతా తన ఘనతే అనుకునే మనస్తత్వం కాదట ఆమెది. ఏ సినిమా విజయంలో ఎంత వాటా తీసుకోవాలో తనకు తెలుసునంటోంది. ప్రస్తుతం తెలుగునాట ఊపిరి సలపనంత బిజీగా ఉన్న కథానాయిక రకుల్.
రాశీఖన్నా: టాలీవుడ్‌లో నాలుగేళ్ల క్రితం తన ప్రయాణాన్ని ప్రారంభించింది రాశీఖన్నా. చూస్తుండగానే క్రేజీ కథానాయిక అయింది. ముద్దుగా, అందంగా, అల్లరిగా ఎలా కావాలంటే అలా పాత్ర స్వభావానికి తగ్గట్టు మారిపోతుంటుంది ఈ బ్యూటీ. దానికితోడు మంచి గాయని కూడా. అందుకే మంచి అవకాశాలొస్తున్నాయి. వాటిని చక్కగా ఒడిసి పట్టుకుంటోంది. 2013లో బాలీవుడ్‌లో వచ్చిన ‘మద్రాస్ కేఫ్’ ద్వారా వెండితెర ప్రయాణాన్ని మొదలు పెట్టిం ది. 2014లో తెలుగులో వచ్చిన ‘మనం’లో ప్రేమగా (స్పెషల్ అప్పీయరెన్స్), అదే సంవత్సరం ‘జోరు’లో అన్నపూర్ణగా, ‘ఊహలు గుసగుసలాడే’లో ప్రభావతిగా నటించింది. 2015లో ‘జిల్’లో సావిత్రిగా, ‘శివం’లో తనుగా, ‘బెంగాల్ టైగర్’లో శ్రద్ధగా నటించి తనేంటో నిరూపించుకుంది. 2016లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘సుప్రీమ్’లో బెల్లం శ్రీదేవిగా, ‘హైపర్’లో భానుమతిగా నటించిన ఈ అమ్మడు తాజాగా ‘జై లవకుశ’లో ప్రియగా వికసించింది. తాజాగా ఆమె నటించిన ‘రాజా ది గ్రేట్’, ‘ఆక్సిజన్’, ‘టచ్‌చేసి చూడు’, ‘తొలిప్రేమ’ నిర్మాణంలో వున్నాయి. రాశీఖన్నా దూకుడుకు ఏ మాత్రం తిరుగులేదు. వరుసగా అవకాశాల్ని సొంతం చేసుకుంటూనే వుంది. తమిళ, మలయాళ చిత్రసీమలోనూ పాగా వేస్తోంది.
కీర్తి సురేష్: తమిళ, మలయాళంతో పాటు తెలుగు చిత్రాల్లో మెరిసిపోతున్న బ్యూటీ కీర్తి సురేష్‌కు అవకాశాలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. గత ఏడాది 2016లో ‘నేను శైలజ’లో శైలజగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ భామ 2017లో ‘నేను లోకల్’లో కీర్తిగా దర్శనమిచ్చింది. మలయాళంలో బాలనటిగా ప్రవేశించిన కీర్తి 2013 వరకు అక్కడ పలు చిత్రాలు చేసింది. ‘గీతాంజలి’ చిత్రం ద్వారా మలయాళంలో హీరోయిన్‌గా ప్రవేశించింది. ఇప్పు డు ఆమె డైరీ పలు చిత్రాలతో బిజీగా మారింది. ‘పిఎస్‌పికె 25’లో ప్రియగా, ‘మహంతి’లో సావిత్రిగా నటిస్తున్న ఈ భామ తమిళ, మలయాళంలో కూడా బిజీగానే గడుపుతోంది.
అనుపమ పరమేశ్వరన్: మలయాల ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ తెలుగు ప్రేక్షకులపై తనదైన ముద్రవేసింది. ఇప్పుడామెని అచ్చమైన తెలుగు అమ్మాయిలాగే చూస్తున్నారంతా. ‘అ ఆ’తోనే మొదలైన ఈ బ్యూటీ నట జీవితంలో తొలి సినిమాలోనే మన భాష నేర్చుకుంది. గొంతూ సవరించుకుంది. కట్టూ బొట్టూతోనే కనికట్టు చేసి తన కంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంది. 2015లో మలయాళంలో వచ్చిన ‘ప్రేమమ్’లో మేరీ జార్జ్‌గా చిత్రసీమకు పరిచయమైన ఈ బ్యూటీ 2016లో ‘అ ఆ’లో నాగవల్లిగా తెలుగు ప్రేక్షకుల మనసుల్ని దోచుకుంది. ఆ తర్వాత ‘ప్రేమమ్’లో సుమగా, 2017లో ‘శతమానం భవతి’ లో నిత్యగా నటించి మంచి మార్కుల్ని కొట్టేసింది. మలయాళం, తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తున్న ఈ కేరళకుట్టి నటిస్తున్న తాజా చిత్రాలు రామ్ హీరోగా ‘ఉన్నది ఒక్కటే జిందగీ..’తో పాటు, నానికి జోడీగా ‘కృష్ణార్జున యుద్ధం’, ‘సవ్యసాచి’, తెలుగు, కన్నడంలో తెరకెక్కుతున్న ‘వేటగాడు’ నిర్మాణంలో వున్నా యి. ప్రస్తుతం అనుపమ చేతిలో వున్న చిత్రాలన్నీ కీలకమైనవే. ఈ చిత్రాలు కూడా విజయవంత మయ్యాయంటే ఈ భామ కెరీర్ మరో స్థాయికి వెళ్లడం ఖాయం.
నివేదా థామస్: మోడలింగ్ నుంచి వెండితెరకు పరిచయమైన ఈ కేరళకుట్టి ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో నటిస్తోంది. 2008లో బాలనటిగా మలయాళ చిత్రసీమకు పరిచయమైంది. 2016లో వచ్చిన ‘జెంటిల్‌మెన్’లో కేథరిన్‌గా నటించిన ఈ బ్యూటీ ఈ ఏడు ‘నిన్నుకోరి..’లో పల్లవిగా, ‘జై లవకుశ’లో సిమ్రాన్‌గా కనువిందు చేసింది. నవీన్ చంద్రకు జోడీగా నటిస్తున్న ‘జూలియట్ లవర్ ఆఫ్ ఇండియట్’ నిర్మాణంలో వుంది.
అను ఇమ్మాన్యుయల్: తెలుగు, తమిళ, మాలయాళ భాషల్లో నటిస్తున్న అను 2011లో వచ్చిన ‘స్వప్నా సంచారీ’ మలయాళ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. నాని సరసన 2016లో వచ్చిన ‘మజ్ను’లో కిరణ్మయిగా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. తొలి సినిమాతోనే ప్రేక్షకుల మనసుల్ని దోచుకుంది. అందానికి అందం, మంచి టాలెంట్ వున్న ఈ భామ రెండో సినిమాకే పవన్‌కళ్యాణ్ సరసన అవకాశాన్ని పట్టేసింది. 2017లో ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’లో జానకిగా అలరించింది. ‘ఆక్సిజన్’, ‘పిఎస్‌పికె 25’, ‘నా పేరు సూర్య’, ‘వేటగాడు’ (తెలుగు- కన్నడ), ‘కలియుగ పాండవులు’ చిత్రాలు నిర్మాణంలో వున్నాయి. ఇవేగాక, ఎన్‌టిఆర్, చరణ్, మహేష్‌బాబుల చిత్రాల్లో నటించే అవకాశాన్ని కూడా చేజిక్కించుకుందట. ప్రస్తుతం టాలీవుడ్‌లో క్రేజీ భామగా మారిన అనుకు అవకాశాలు క్యూకడుతున్నాయి.
సాయి పల్లవి: మలయాళంలో తెరకెక్కిన ‘ప్రేమమ్’ లో మలార్‌గా మురిపించి.. కుర్రాళ్ల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది సాయి పల్లవి. భాషతో సంబంధం లేకుండా ఆ పాత్రని, అందులో ఆమె నటనని ఆస్వాదించారు. ఇటీవల ‘్ఫదా’తో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ‘‘మనసుపెట్టి చేస్తే తప్పకుండా ఫలితం వస్తుందని తెలుసు. కానీ ‘్ఫదా’కి వచ్చిన స్పందన నా సంతోషాన్ని రెట్టింపు చేసింది’’ అని చెబుతోంది సాయి పల్లవి. జార్జియాలో ఎంబిబిఎస్ చేసింది. కార్డియాలజీ చదువాలనుకుంది. కానీ ఇలా నటిగా మారాల్సి వచ్చింది. ప్రస్తుతం నానికి జోడీగా ‘ఎం.సి.ఎ’లో నటిస్తోంది. తమిళంలోనూ బిజీగానే మారింది. 2008లో తమిళంలో వచ్చిన ‘్ధమ్ ధూమ్’ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమయింది. ప్రస్తుతం మలయాళం, తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తోంది. 2015లో ‘ప్రేమమ్’ (మలయాళం), 2016లో ‘కాళి (మలయాళం) చిత్రాల్లో నటించింది. తెలుగులో భానుమతిగా ‘్ఫదా’లో విజృంభించింది. మిడిల్ క్లాస్ అమ్మాయి శ్రావణిగా ‘ఎంసిఏ’లో కనిపించబోతోంది. ఇలా సాయి పల్లవి బిజీగానే మారబోతోంది.
టాలీవుడ్‌లో ఇటీవల కాలంలో నాయికా ప్రాధాన్య చిత్రాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. బాలీవుడ్‌లో నూ ‘అకిరా’, ‘మేరీ కోమ్’లాంటి సినిమాలు మంచి వసూళ్లు, పేరు సంపాదించుకున్నాయి. దక్షిణాదిలోనూ ఈ తరహా సినిమాలు రూపొందుతున్నాయి. కాలం మారుతోంది అనడానికి ఇదే నిదర్శనం. హాలీవుడ్‌లో పేరున్న కథానాయకులు, నాయికలు అప్పుడప్పుడూ చిన్న సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపిస్తారు. ఇలాంటి సినిమాలే చేయాలి.. ఇలాంటి పాత్రల్లోనే కనిపించాలి అనే గీతల్ని వాళ్లెప్పుడో చెరిపేశారు. మన దగ్గర ఇలాంటి వాతావరణం రావాలి. ఎవరు ఎలాంటి పాత్ర అయినా చేయడానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడే కొత్త తరహా కథలు పుట్టుకవస్తాయి. బాలీవుడ్‌లో విద్యాబాలన్, దీపికా పదుకొనే, ఆలియాభట్‌ని చూడండి. ప్రతీసారీ ఓ కొత్త పాత్రతో షాక్ ఇస్తారు. స్టార్ హీరోల పక్కనే నటించాలి.. పెద్ద సినిమాలే చేయాలి అనే షరతులేం పెట్టుకోరు. వాళ్లెప్పుడు ఎలాంటి పాత్రల్లో కనిపిస్తారో ఎవరూ ఊహించలేరు. అలాంటి ప్రయత్నాలు తెలుగులోనూ జరగాలి. చిన్నా, పెద్దా అనే సరిహద్దులు చేరిపేయాలి. కథానాయకులతో పోలిస్తే మా పాత్రలకు ప్రాధాన్యమే దక్కడం లేదంటూ నిరుత్సాహాన్ని వ్యక్తం చేసేవారు ఇదివరకు కథానాయికలు. కానీ ఇటీవల వాళ్ల స్వరం మారుతోంది. మాకూ మంచి రోజులొచ్చాయని చెబుతున్న మెరుపుతీగలు ఇప్పుడు చాలా మందే కనిపిస్తున్నారు. తెలుగు సినిమాలో కథానాయిక పాత్రల గురించి తొలినాళ్లలో విన్నది ఒక రకం. ఇప్పుడు చూస్తున్నది మరో రకం. వారి పాత్రలకి ప్రాధాన్యం పెరుగుతుంది. ఇదో మంచి మార్పు. ఇది వరకు కథానాయిక అంటే గ్లామర్ కోణంలో చూసేవారు. కానీ ఇప్పుడు ఆ విషయాన్ని దాటి ఆలోచిస్తూ పాత్రల్ని తీర్చిదిద్దుతున్నారు. ఎంత ఎదిగినా మూలాల్ని, ఎంత ఎత్తుకు చేరుకున్నా నడిచొచ్చిన దారిని మర్చిపోకూడదు. ఆ అనుభవాలే వెలకట్టలేని పాఠాల్ని భవిష్యత్తుకు కావాల్సినంత భరోసాని అందిస్తుంటాయి. ఈ విషయాన్ని కథానాయికలు గుర్తించినప్పుడే వారి కెరీర్ ఆశాజనకంగా పరుగులు పెడుతుంది.
-ఎం.డి అబ్దుల్