Monday, September 29, 2014

Thursday, September 18, 2014

Monday, July 21, 2014

Friday, July 18, 2014


సమాంతర సమాహారం!
18/07/2014-ఎం.డి.అబ్దుల్

============ ఈ ఉత్సవాలు నిర్వహించడానికి ఎన్నుకున్నప్పటినుండి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. ఇదొక అరుదైన అవకాశం. ముఖ్యంగా దర్శకులు, ఫిలిమ్ మేకర్స్ ఈ చిత్రాలను చూసి, సినిమా నిర్మాణ విలువలను తెలుసుకున్నారు.
-శైలజా సుమన్ , డిప్యూటీ డైరెక్టర్ జనరల్

============ఈ ఉత్సవాలు హైదరాబాద్‌లో నిర్వహించడం తెలుగువాడిగా నేను గర్విస్తున్నాను. ఈ ఉత్సవాలు నిర్వహించిన దూరదర్శన్‌ని అభినందిస్తున్నాను. ఈ ఉత్సవాల వల్ల ఇతర భాషా చిత్రాలను చూసి అక్కడి సంస్కృతి సంప్రదాయాలను తెలుసుకోవచ్చు.
-డా.డి.రామానాయుడు
============ఈ ఉత్సవాలకు అద్భుతమైన ఆదరణ లభించింది. మంచి సినిమాలను చూడడానికి అనేక మంది సినీ ప్రేమికులు విచ్చేశారు. అందరి సహకారంతో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాం. -
అనితాసిన్హా అడిషనల్ డైరెక్టర్ జనరల్
============తెలుగు నిర్మాతలు ఇలాంటి చిత్రాలను స్ఫూర్తిగా తీసుకొని జాతీయ స్థాయలో పోటీపడే చిత్రాలను నిర్మిస్తారని ఆశిస్తున్నాను. ఈ ఉత్సవాల్లో పాల్గొన్న ప్రతీ ఒక్కరూ ఇతర భాషా చిత్రాలను చూసి ఎంతో ముచ్చటపడ్డారు.
-షరీష్
దృశ్యమాథ్యమం ప్రధానంగా మానవ జీవితంలోని అన్ని కోణాలను స్పృశిస్తుంది. ఇందుకు ప్రధాన వేదిక సినిమా. భారతదేశంలో అనేక భాషల్లో ఉద్ధండులైన దర్శకులు సినిమాలను రూపొందిస్తున్నారు. కమర్షియల్ పంథాను అనుసరించకుండా కేవలం మానవ జీవితంలోని వివిధ కోణాలను ఆవిష్కరిస్తూ తీసిన సమాంతర చిత్రాలకు వాణిజ్య విలువలు లేకపోయినా ఉత్తమాభిరుచిగల ప్రేక్షకుల ఆదరణ ఎప్పటికీ ఉంటుంది. ఇది గమనించిన హైదరాబాద్ దూరదర్శన్ ‘బెస్ట్ ఆఫ్ ఇండియన్ సినిమా’ పేరిట ఫిలిం ఫెస్టివల్ నిర్వహించింది. ఈనెల 12, 13 తేదీలలో భారతదేశంలోని రెండవసారి దూరదర్శన్ నిర్వహించిన ఫిలిం ఫెస్టివల్‌కు వేదికగా హైదరాబాద్ మారింది. తొలిసారిగా ఢిల్లీలో నిర్వహించిన ఈ ఉత్సవం, హైదరాబాద్‌లో నిర్వహించడం నగర సినీ ప్రియులకు ఆనందాన్నిచ్చింది. వైభవంగా ప్రారంభమైన ఈ వేడుకలను దాదాసాహెబ్ అవార్డు గ్రహీత డా. డి.రామానాయుడు ప్రారంభించారు. ఉత్సవంలో తొలి చిత్రంగా రాజేంద్రప్రసాద్ నటించగా ఈశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో సి.సి.రెడ్డి తెలుగులో రూపొందించిన ‘మీ శ్రేయోభిలాషి’ చిత్రాన్ని ప్రదర్శించారు. మనిషి జీవితంలో చీకటికోణం ఆత్మహత్య చేసుకోవాలని అనుకోవడం. అటువంటి ఆలోచన రావడం చాలా పెద్ద నేరం, తప్పు అంటూ ఈ చిత్రంలో కథానాయకుడు వాదిస్తాడు. అలా ఆత్మహత్య ముంగిట్లోకి వెళుతున్న అనేకమందిని చేరదీసి వారందరినీ ఒకేసారిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మరణం సమీపానికి తీసుకెళతానని మాట ఇస్తాడు. అలా చెబుతూ జీవితంపై ఆశ కలిగేలా వారిలో మార్పు రావడం కోసం ప్రయత్నిస్తాడు. చివరికి ఆయన అనుకున్న మార్పు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నవారిలో వచ్చిందా, లేదా? అన్న కథనంతో ఈ చిత్రం ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. అనంతరం జరిగిన సమావేశంలో దర్శకుడు ఈశ్వర్‌రెడ్డి ఈ చిత్రం నిర్మించడానికి గల కారణాలను, చిత్రీకరణ సమయంలో అనుభవాలను వివరించారు. ప్రేక్షకులు అడిగిన పలు ప్రశ్నలకు జవాబులిచ్చారు. సుమన్ ముఖోపాధ్యాయ దర్శకత్వంలో బెంగాలీ భాషలో రూపొందించిన ‘హెర్బెట్’ అనే 142 నిమిషాల చిత్రాన్ని ఆ తరువాత ప్రదర్శించారు. 1997లో సాహిత్య అకాడమీ అవార్డు పొందిన నబరూన్ భట్టాచార్య అందించిన కథతో దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించారు. అతీంద్రియ శక్తులు అనేవి మనుషులమధ్య ఉన్నాయా లేవా? అన్న సమస్యను ఈ చిత్రం చూపుతుంది. మరణించినవారితో మాట్లాడడం సంభవమేనా? అలా మాట్లాడితే ఏ ఏ విషయాలు తెలుసుకోవాలనుకుంటారు? అలా మరణించినవారితో మాట్లాడే కథానాయకుడి పాత్రతో ఈ చిత్రం సాగుతుంది. చివరికి అతను మరణించాక ఎవరితో మాట్లాడాడు అన్న కథనంతో ఈ చిత్రం సరికొత్త స్క్రీన్‌ప్లేతో సాగి ప్రేక్షకులను ఆకట్టుకుంది. శివాజీ చంద్రభూణ్ దర్శకత్వం వహించిన మరో హిందీ చిత్రం ‘వన్‌మోర్’. 94 నిమిషాల ఈ హిందీ చిత్రం లడఖ్‌లో జరిగే ఓ కథతో సాగింది. మారుమూల ప్రాంతంలోవున్న కొండలపై జరిగే ఐస్‌హాకీ అనే ఆటతో ముడిపడిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. రష్యాలో క్రీడాకారులు ఆడే ఈ ఆట భారతదేశంలో కూడా ఆడాలని రచయిత కోరిక. అదికూడా గిరిజన ప్రాంతాలలో ఎత్తయన కొండలలో ఉండే క్రీడామైదానాల్లో ఈ ఆట ఆడాలని, సంస్కృతి సంప్రదాయాలకు అతీతంగా, రాజకీయ సరిహద్దులను చెరిపేసేలా ఈ ఆట ఓ ఫ్యాషన్‌లా మారాలని కథానాయకుడు భావిస్తాడు. ప్రస్తుతం క్రికెట్ దేశంలో ఎంత ఆదరణ పొందిందో, అంత ఆదరణ పొందాలనుకుంటాడు. దేశంలో ఎత్తయన కొండలు ఇటువంటి క్రీడలు ఆడడానికి అనువుగా వుండాలన్న కోరికతో ఈ చిత్రం సాగింది. శివాజీ చంద్రభూషణ్ ఈ కథను సరికొత్త విధానంతో ప్రకృతిని మనం ఎంతగా ఆరాధించాలో చెబుతూ మమేకం చేస్తాడు. పరేష్ కామ్‌దార్ హిందీలో రూపొందించిన 94 నిమిషాల ‘ఖర్గోష్’ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఖర్గోష్ అంటే ఓ అందమైన కుందేలు అని అర్థం. అటువంటి ఛాయలున్న బంటూ అనే బాలుడు కథా కథనం ఈ చిత్రం. ప్రియంవాడ్ రచించిన ఈ కథతో పరేష్ కామ్‌దార్ ఓ మంచి చిత్రాన్ని రూపొందించాడు. చుట్టూ వున్న వాతావరణంతో బంటూ ఎలా ఒదిగిపోయాడు, కొత్త కొత్త విషయాలు ఎలా నేర్చుకున్నాడు, అతని చుట్టూ జరుగుతున్న మార్పులు ముఖ్యంగా తన స్నేహితులైన అబ్బాయిలు, అమ్మాయిల వ్యక్తిగత మార్పులు ఎలా వున్నాయి, తాను ఎలా మారాలి అన్న కథనంతో ఈ చిత్రం సాగింది. చిన్నపిల్లల ఆలోచనా దృక్పథంతోసాగే ఈ చిత్రం ప్రదర్శన అనంతరం దర్శకుడు పరేష్ కామ్‌దార్ సినిమా మేకింగ్‌కు సంబంధించిన అనేక వెళకువలు తన ప్రసంగం ద్వారా వినిపిస్తూనే ఎడిటింగ్ ప్రాముఖ్యతను తెలిపారు. అంతేకాదు, ప్రేక్షకులు అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పారు. తమిళంలో అంశాన్‌కమార్ రూపొందించిన ‘ఒరుత్తి’ చిత్రం సావని అనే ఓ అమ్మాయి కథనంతో సాగింది. 91 నిమిషాల ఈ చిత్రకథను కె.రాజ్‌నారాయణ్ రచించారు. తమిళనాడులోని పీఠభూముల్లో అలంపట్టి అనే ఊరిలో జరిగిన ఈ కథలో సావని పత్తి పండించే ప్రాంతాల్లో పొలం పనులు చేస్తుంది. స్థానిక జమీందారు పన్నులు వసూలు చేస్తూ ప్రభుత్వానికి జమ చేయడు. ఈ విషయంలో గ్రామస్థులలో భేదాభిప్రాయాలు పొడసూపుతాయి. చిన్న వయస్సు ఉన్నా సావని జమీందారిలో మార్పు రావడం కోసం తన వంతు ప్రయత్నం చేస్తుంది. దీంతో జరిగిన ఓ సంఘటనతో గొప్పింటి అబ్బాయి ఎలప్పన్‌తో సావనికి వివాహం చేయాలని గ్రామస్థులు అనుకుంటారు. గ్రామస్థులు జమీందారు భయానికి జడిసి ఇలా చేస్తున్నారని గ్రహించిన సావని, చిన్న కులాలలో ఇటువంటి ఇబ్బందులు తప్పవని భావించి, తన కులస్థులలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. తమిళంలో రూపొందిన ఈ చిత్రంలో కథానాయికగా నటించిన అమ్మాయి అద్భుతమైన ప్రతిభతో ప్రతి సన్నివేశాన్ని ఆకట్టుకునేలా నటించింది. ఆ తరువాత మణిపురి భాషలో డా. ముఖోమణి మోగాసాబా రూపొందించిన ‘ఎన్నింగ్ అమాడి లిక్లా’ చిత్రాన్ని ప్రదర్శించారు. 135 నిమిషాల నిడివిగల ఈ చిత్రంలో సానాటోబా అనే పదేళ్ల కుర్రాడు కథానాయకుడు. తాగుబోతు తండ్రి తనను నిర్లక్ష్యం చేస్తున్నాడన్న బాధతో ఉన్నా, రైస్‌మిల్లులో పనిచేసే అమ్మ సహకారంతో చదువుకోవడానికి బడికి వెళుతుంటాడు. అక్కడ పక్కింటి అమ్మాయి క్లాస్‌లో స్నేహితురాలుగా మారుతుంది. ఇంటికి వచ్చాక మాత్రం ఆమె ఎవరో అతనికి తెలియనట్లే ఉంటాడు. తండ్రిని తాగుబోతుగా చూడడం ఇష్టంలేక అతనిలో మార్పుకోసం ప్రయత్నిస్తాడు. ఈ నేపథ్యంలో తన స్నేహితురాలు సహకారం ఎలా పొందాడు అన్న కథనంతో సాగే ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా గాలిపటాల పాటలో సంగీత దర్శకుడు చూపిన ప్రతిభ అందరికీ నచ్చింది. ఇలాంటి అద్భుత కథనాలతో వున్న ఆరు చిత్రాలను హైదరాబాద్ దూరదర్శన్ ప్రేక్షకులకు దగ్గరచేసింది. ఈ చిత్రాలన్నీ గమనిస్తే కొట్టొచ్చేట్టు కన్పించేది ఏమంటే ఆరుగురు దర్శకులు వివిధ భాషల్లో బాలల నేపథ్యంలో రూపొందినవే. బాలలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఈ చిత్రాలు చూపాయి. అదేవిధంగా పెద్దలు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ‘మీ శ్రేయోభిలాషి’లో చర్చించారు. అదీంద్రియ శక్తుల నేపథ్యంలో ఒకటి, మారుమూల క్రీడా ప్రాధాన్యత గూర్చి మరొకటి కూడా ఫిల్మోత్సవంలో భాగం అయ్యాయి. హైదరాబాద్ దూరదర్శన్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ అనితా సిన్హా, డి.డి.జి. ఎం.శైలజా సుమన్, ఎ.డి.పి.బెల్లి ఈ ఉత్సవాన్ని నిర్వహించడంలో ప్రధానపాత్ర నిర్వహించారు. సినిమా ఎక్కడైనా సరే ప్రేక్షకులకు ఓ పాఠంగా, వారి జీవితాల్లో మార్పులు సూచించేదిగా ఉండాలన్న ఓ మాటను ఈ చలనచిత్రోత్సవాలు నిజం చేశాయి. ఇటువంటి ఉత్సవాలు మరిన్ని జరిగి ఉత్తమ చిత్రాలను ప్రేక్షకులను అందించాలని కోరుకుందాం.
ఫ్యామిలీ డ్రామా!
18/07/2014-ఎం.డి.అబ్దుల్
** దృశ్యం (ఫర్వాలేదు)
తారాగణం:
వెంకటేష్, మీనా, నదియా
సమీర్, నరేష్, రవికాలే
పరుచూరి వెంకటేశ్వరరావు
కృతిక తదితరులు
-----------
సంగీతం: ఎస్.శరత్
మాటలు: డార్లింగ్ స్వామి
కథ, స్క్రీన్‌ప్లే: జీతు జోసెఫ్
ఛాయాగ్రహణం: ఎస్.గోపాల్‌రెడ్డి
నిర్మాతలు: రాజ్‌కుమార్ సేతుపతి, సురేష్
దర్శకత్వం: శ్రీప్రియ
================
మలయాళంలో ఘన విజయం సాధించిన చిత్రం ‘దృశ్యం. చాన్నాళ్లుగా రీమేక్ కథల పట్ల ఆసక్తి కనబరిచే వెంకటేష్ ఈ సినిమా చేయనున్నట్టు వార్తలు రావటంతో సహజంగానే అభిమానుల్లో ఎన్నో ప్రశ్నలు పొడసూపాయి. మలయాళంలో ‘మోహన్‌లాల్’ ఈ కథకి జీవం పోశాడు?! మరి ఆ పాత్రలో వెంకటేష్ ఎలా ఉంటాడో? కథ ఏమిటో? ఇత్యాది ప్రశ్నలతో ఎదురుచూసిన ‘దృశ్యం’ రావటమే కాదు... కడు రమణీయంగా.. అదొక మరపురాని దృశ్యంగా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. ఈ మధ్యకాలంలో వస్తూన్న సినిమాల్లో ‘కథ’ లేకపోవటం చూస్తున్నదే. అంటే ఏమిటన్న ప్రశ్న ఉదయించక మానదు. స్టార్ ఇమేజ్‌లూ చట్రాలంటూ - స్టార్ హీరో కాల్షీట్ దొరికిందే భాగ్యమన్నట్టుగానూ - ఆ హీరోకి తగ్గ కథ అంటూ లేనిపోని ‘రేంజ్’లను సృష్టించటం.. గత చరిత్రల్ని తిరగేయటం... పూర్వీకుల పుట్టుపూర్వోత్తరాల తాలూకు డైలాగ్స్‌తో పేజీల్ని నింపటంతో - ఇటు ప్రేక్షకులు అటు అభిమానులు ఒక్కో సందర్భంలో అసందిగ్ధ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు కూడా. ఈ సందిగ్ధావస్థలో ‘దృశ్యం’పై అనేకానేక అనుమానాలూ వచ్చాయి. మలయాళ కథ తెలుగు నెటివిటీకి సరిపోతుందా? తెలుగు హీరో ‘ఇద్దరు పిల్లల తండ్రి’గా నటిస్తే చూస్తారా? ఫ్యామిలీ డ్రామాని ఇష్టపడతారా? అంటే- కథని తీసే రీతిలో తీస్తే.. కచ్చితంగా అందమైన ‘దృశ్యం’ కనిపిస్తుంది.
రాంబాబు (వెంకటేష్) అనాధ. స్వయంకృషితో జీవితంలో ఒక స్థాయికి చేరుకుంటాడు. మధ్యతరగతి దోబూచులాటలతో నిత్యం వేగిపోయే మనస్తత్వం. ఆ ఊళ్లో కేబుల్ నడిపిస్తూ భార్య జ్యోతి (మీనా), కుమార్తెలు అంజు (కృతిక), అను (బేబీ ఎస్తేర్)లను పోషించుకొంటూంటాడు. అతడికి భార్య కంటే కూడా సినిమాలంటే బోలెడంత ఇష్టం. ఎంత అంటే? సినిమా తర్వాతనే అతడి కుటుంబం. రాంబాబుకి అవినీతి అంటే పడదు. ఆ ఊరి కానిస్టేబుల్ వీరభద్రం (రవి కాలే)కి అదే ప్రవృత్తి. వీరభద్రం చేసే అవినీతి కార్యక్రమాల్ని చూళ్లేక ఎదురు తిరుగుతాడు రాంబాబు. అతడిపై పగ తీర్చుకోవటానికి సమయం కోసం ఎదురుచూస్తూంటాడు వీరభద్రం. ఐజి గీతా ప్రభాకర్ (నదియా) కొడుకు వరుణ్ తప్పిపోతాడు. ఆ కేసులో రాంబాబుని ఇరికిస్తాడు వీరభద్రం. ఆ తర్వాత ఏం జరిగిందన్నది క్లైమాక్స్.
కథని నమ్మితే- చెడు చేయదన్నది ఎన్నాళ్లుగానో వస్తున్న సినీ నీతిసూత్రం. ‘రీమేక్’ అన్నామా? ఆ కథని ఏదో విధంగా చిత్రిక పట్టేసి... కొసమెరుపులన్నీ తీసేసి... తెలుగు నేటివిటీకి తగ్గట్టు అని - కామెడీ ట్రాక్‌లనీ... ఇమేజ్‌కి తగ్గట్టు పవర్‌ఫుల్ పంచ్ డైలాగ్‌లనూ గుది గుచ్చేయటం పరిపాటి. దాంతో ‘కాళిదాసు కవిత్వం కొంత... నా పైత్యం కొంత’ అన్నట్టుగా కథ తయారవుతుంది. కానీ - ఇక్కడ ఆ ‘్ఫల్’ని ఏ మాత్రం చెడగొట్టకుండా - కథలో ఎటువంటి మార్పులు చేయకుండా - ఉన్నది ఉన్నట్టుగా సన్నివేశానికి సన్నివేశం తీయటంతో - ఇన్నాళ్లకి ఒక మంచి సినిమా చూశాం అన్న సంతృప్తి కనిపించింది ప్రేక్షకుల కళ్లల్లో. అంత మాత్రాన ఇదేదో బ్రహ్మాండం అని చెప్పటం కాదుగానీ... థ్రిల్లర్‌ని కుటుంబ నేపథ్యంలో చూపటంతో - ప్రేక్షకుడు కూడా ఆ ‘ఎత్తుగడల’ను తానే వేస్తూన్నట్టు భావిస్తాడు.
ఏ కథైనా మలుపు వరకూ వెళ్లాలంటే- కేరెక్టర్‌ని విశే్లషించటం జరగాలి. లేదూ నేపథ్యాన్ని బేస్ చేసుకొంటూ వెళ్లాలి. ఈ కథలో రాంబాబుని గురించి చెప్పటం... ఊళ్లో గొడవలు... కానిస్టేబుల్ వీరభద్రం సంగతులతో ఫస్ట్ హాఫ్ చాలా వరకూ సాగింది. ఇంతకీ దర్శకురాలు శ్రీప్రియ ఏం చెప్పదలచుకున్నదీ? అన్న సందేహం రాక మానదు. కథ మలుపులోకి రావటం ఆలస్యం - మితిమీరిన వేగంతో పయనించింది. ఆ టెంపోని అలాగే మెయిన్‌టెయిన్ చేస్తూ క్లైమాక్స్ వరకూ వచ్చింది. కథలో ప్రేక్షకుడు ఎప్పుడైతే ఇన్‌వాల్వ్ అవుతాడో ఇక కథకి వచ్చిన ఢోకా ఏం లేదు. అదే వెళ్లిపోతుంది - ప్రేక్షకుణ్ణి తీసుకొని. ఈ కథ నాదే. నేనే వీరభద్రాన్ని ఎదుర్కోవాలి. ఎలా నా కుటుంబాన్ని రక్షించుకోవాలి? అన్న ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరయ్యేట్టు ప్రేక్షకుణ్ణి చేసి.. ఇది అతడి కథే అన్నట్టు చేయటంలో నూటికి నూరు మార్కులు పడ్డాయి దర్శకురాలికి.
హీరో అంటే ఫైట్స్ చేయాలి. డ్యూయెట్లు పాడాలి. నాలుగు కుళ్లు జోకులతో అభిమానుల్ని అలరించాలి. పవర్‌ఫుల్ పంచ్ డైలాగ్‌లతో చప్పట్లు కొట్టేట్టు చేయాలి అన్న నియమం నుంచీ - ఎప్పుడైతే తెలుగు హీరో బయటపడతాడో అప్పుడే సినీ కథ బాగు పడుతుంది అన్న మాటకి ఈ సినిమా సరికొత్త ప్రక్రియకు తెర తీసింది. రాంబాబు ఒక మధ్యతరగతి కుటుంబీకుడు. అలాగే ఉంటాడు. అలాగే ప్రవర్తిస్తాడు కూడా. తెలుగు హీరో అలా ప్రవర్తించవచ్చా? కలల్లో బతికేయాలి. హీరోయిజం అంటే విలన్‌ని నాలుగు దెబ్బలు కొట్టాలి.. లాంటి భేషజాలకు వెళ్లలేదు. అందుకే- ఈ కథ అనుభూతిని మిగిల్చింది.
వెంకటేష్ ఈ కథని ఒప్పుకోవటమే ఒక సాహసం. అందునా - ఎదిగిన ఇద్దరు పిల్లల తండ్రిగా. హీరోయిజం ప్రదర్శించటానికేం లేదు. మామూలుగా మధ్యతరగతి తండ్రి కుటుంబంతో ఎలా ఉంటాడో అలాగే ఉండాలి. అంటే - హీరోకి చేతులు కట్టేసినట్టే. వెంకటేష్ ఇలా అనుకోలేదు. కథ ఏం చెప్పిందో అదే చేశాడు. అందుకే ‘దృశ్యం’లో ఎక్కడా వేలు పెట్టటానికి లేదు. మీనా నటనలో మరింత పరిణతి కనిపించింది. హీరోతో స్టెప్పులేసే.. ఆర్భాటాలేవీ పెట్టుకోకుండా - సాదాసీదా గృహిణిగా ఎంతో హుందాతనంతో కనిపించింది. పిల్లల పాత్రల్లో కృతిక, ఎస్తేర్ చక్కగా నటించారు. నదియా పాత్రలో ఏదో వెలితి కనిపించింది. పాత్ర పరిధి తక్కువ కాబట్టి... అలా ఉందేమో?! కానిస్టేబుల్ వీరభద్రంగా రవి కాలే చక్కటి నటన ప్రదర్శించాడు. విలన్ అంటే ఇతడే అన్నట్టుగా - నెగెటివ్ షేడ్స్ చూపాడు. వెంకటేశ్ అసిస్టెంట్‌గా సప్తగిరి... పరుచూరి వెంకటేశ్వరరావు, చిత్రం శ్రీను, ఉత్తేజ్.. ఇలా ఎవరికి వారే - కథని అద్భుతంగా పండించారు.
శరత్ సంగీతం... బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ‘డార్లింగ్’ స్వామి డైలాగ్స్ గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలి. మామూలుగా మాట్లాడుకొనే మాటల్లానే ఉన్నా... ఎద లోతుల్లో అలజడిని సృష్టించాయి.
మలయాళ ‘దృశ్యం’ కథకి మూలం - ‘సస్పెక్ట్ ఎక్స్’ అనే జపనీస్ సినిమా అంటూ వార్తలొచ్చినా... ఏ కథనైనా తీసుకొంటే- దాన్ని ఎంతవరకూ సక్సెస్ చేయగలమన్న నమ్మకం ప్రధానం. అదే ఇక్కడ జరిగింది.
కామెడీ ట్రాక్ లుండాలి. రొమాన్స్ సీన్లు ఉండాలి. టూ-పీస్ సన్నివేశాలుండాలి అని ఎవరూ అడగరు. అలా ఉంటేనే చూస్తారన్నదీ లేదు. ఈ సినిమా అలాంటిదే. ఫ్యామిలీ డ్రామాకి కాస్తంత థ్రిల్లర్‌ని కలిపి - ‘దృశ్యం’ని ఎలా మలచారో తెలుస్తుంది.


Tuesday, July 15, 2014

Monday, June 16, 2014

Saturday, May 31, 2014

 మూడు తరాల ముచ్చటైన కథ!
30/05/2014 | By MDABDUL
*** మనం (బాగుంది)
తారాగణం:
అక్కినేని నాగేశ్వరరావు
నాగార్జున, నాగ చైతన్య
సమంత, శ్రీయ
లావణ్య, అఖిల్ తదితరులు
మాటలు: హర్షవర్థన్
సంగీతం: అనూప్ రూబెన్స్
ఛాయాగ్రహణం: పి.ఎస్.వినోద్
నిర్మాణం: అక్కినేని కుటుంబం
కథ, కథనం, దర్శకత్వం:
విక్రమ్ కె.కుమార్
అక్కినేని ఫ్యామిలీ. మూడు తరాల హీరోలు.. అక్కినేని నాగేశ్వరరావు ఆఖరి చిత్రం...ఏం తీసి ఉంటారు? ఏం చెప్పి ఉంటారు? ఎన్నాళ్లుగానో వెంటాడుతున్న ఫీలింగ్. పోస్టర్లు ప్రత్యక్షం. తాతగారు చిరునవ్వుతో బాసింపట్లు వేసుకొని.. చేతులు కట్టుకొని.. కింద కూర్చుంటే... రేపటి తరం మనవడు పంచె లాల్చీతో హుందాగా సింహాసనం మీద. ఆ పక్కనే నిన్నటి తరం నవ మన్మథుడు. సూటూ బూటూ కళ్లద్దాల్తో. ఆ పక్కనే కుక్కగారు. ఈ స్టిల్‌తో ఏం చెబుతాడు? తొంగి చూ స్తూ అర చిరునవ్వుతో తాతగారు ఏం చెప్పబోతున్నాడు? ఇదే ఉత్కంఠ. వెంటవెంటనే ట్రైలర్స్... సాంగ్స్ మొదలుకొని విజువల్స్ కూడా.. ఏదో తెలీని భావాలను చెప్పకనే చెబుతున్నాయి. కథేంటో? అన్న ఊహలూ మొదలయ్యాయి. ఏ సినిమాకైనా ఇటువంటి ఆలోచన రావటం.. ఊహల్లో తేలటం ఉండకపోవచ్చు గానీ.. కచ్చితంగా ‘అక్కినేని ఫ్యామిలీ’ ఏ రూపంలో దర్శనమివ్వబోతోందన్న ‘ఆశ’ ప్రేక్షకుల్లో కలిగిందన్నది స్పష్టం. మూడు తరాల హీరోల్ని ‘మనం’ చేసిన దర్శకుడు విక్రమ్ కె.కుమార్ దీన్ని ఒక సినిమా అనుకోలేదు. ఎక్కడ పొరపాటు చేసినా మొత్తం ‘్ఫ్యమిలీ’ని చుట్టేస్తుంది. కొన్నాళ్లుగా ‘హిట్’లేని నాగార్జునపైనా.. కెరీర్ ఆరంభంలోనే ఉండిపోయిన నాగచైతన్యపై ఆ ప్రభావం తప్పక పడుతుంది. అందుకే! వొళ్లు దగ్గర పెట్టుకొని మరీ.. తన కలానికి మరింత పదును పెట్టి తన సత్తా చాటటంలో సక్సెస్ సాధించాడు విక్రమ్. ఈ ఉపోద్ఘాతం కేవలం అక్షరాలు మాత్రమే. దీన్ని అనుభూతించాలంటే.. మాటలు చాలవు. మనసు తెర తీయా లి. అప్పుడే కథ ‘కన్‌ఫ్యూజన్’ లేకుండా అర్థమవుతుంది. అదీకాక మనసు పెట్టి చూస్తే.. వాస్తవ జీవితంలో ఏం పోగొట్టుకున్నామో? ఎంత యాంత్రికంగా బతికేస్తున్నామో అర్థమవుతుంది. ఆ సంకెళ్ల నుంచీ ఒక్కసారిగా బయటికి వచ్చినట్టనిపిస్తుంది.
కథ: రాధామోహన్ (నాగచైతన్య) కృష్ణవేణి (సమంత)లకు ‘బిట్టు’ అనే కొడుకు. తరచూ వీరిద్దరి మధ్య మనస్ఫర్థలు. విభేదాలు. ఇలా జీవితాన్ని నిస్సారంగా గడిపేస్తూన్న నేపథ్యంలో ఇద్దరూ కారు ప్రమాదంలో మరణిస్తారు. బిట్టు ఒంటరివాడవుతాడు. పెరిగి పెద్దవాడై.. బిజినెస్‌మేన్ నాగేశ్వరరావు (నాగార్జున)గా ఎదుగుతాడు. ఒకరోజు నాగేశ్వరరావు ఫ్లైట్‌లో వెళ్తూండగా పక్క సీట్లోని నాగార్జున (నాగ చైతన్య) తన తండ్రి పోలికలతో ఉన్నాడని అభిమానిస్తాడు. ప్రతి విషయంలోనూ సహాయం చేస్తూంటాడు. ఈ జన్మలో నాన్న కనిపించాడు. అమ్మ కూడా ఎక్కడో ఉంటుందన్న ఆశ. కొన్నాళ్లకు నాగేశ్వరరావుకి కనిపించిన ప్రియ (సమంత)ను అమ్మలా భావిస్తాడు. అభిమానిస్తాడు. ప్రేమిస్తాడు. ఈ జన్మలోనూ వారిద్దరినీ కలపాలన్న నేపథ్యంలో డాక్టర్ అంజలి (శ్రీయ) ప్రేమలో పడతాడు. వృద్ధుడైన చైతన్య (డా.అక్కినేని)ని రోడ్డు ప్రమాదం నుంచీ రక్షించిన అంజలి కోసం నాగేశ్వరరావును తన ఇంట్లోనే ఉంచుకొనేందుకు నిర్ణయించుకొంటాడు. చైతన్య ఎవరు? నాగేశ్వరరావు, చైతన్యకి గల సంబంధం ఏమిటి? నాగార్జున, ప్రియల గతం ఏమిటి? ఆయా ప్రశ్నలతో క్లైమాక్స్.
ఎవరూ ఊహించని.. ఊహించలేని కథ ఇది. అక్కినేని హీరోలకు ఒకరి పేరు మరొకరికి పెట్టడం అన్నది మరో స్పెషాలిటీ. ఎవరు ఎవరికి తండ్రి? ఎవరు ఎవరికి కొడుకు? ఇలా కొద్దిగా తికమకతో కథ సాగినప్పటికీ.. అదీ కాసేపే. ఆ తర్వాత్తర్వాత ఆప్యాయతలూ.. అనుబంధాలూ... ప్రేమ లాలిత్యం.. మధురానుభూతులు... కుటుంబ పరంగా కోల్పోతున్న మానవీయ సంబంధాలనూ-ఇలా ఒక్కొక్కటీ స్పృశిస్తూ కథని సాఫీగా నడుపుకుంటూ వెళ్లాడు దర్శకుడు. ఒక్కమాటలో చె ప్పాలంటే.. పునర్జన్మ తాలూకు కథ. ఆ కథకి ప్లస్ పాయింట్‌గా మారిన మూడు తరాల హీరోల కానె్సప్ట్. గత జన్మ తల్లిదండ్రుల్ని కలపటం అన్న సబ్జెక్ట్‌ని ఎక్కడా విసుగు అనిపించకుండా నడిపించాడు. ఒక్కసారి 1983 కాలం అంటాడు. మళ్లీ 2014. ఆ తర్వాత మళ్లీ వెనక్కి 1935లోకి వెళ్తుంది కథ.
ఈ సన్నివేశాల పరంగా చూస్తే... నాగార్జున హుందాగా నటించాడు. పి.ఎ. గిరీష్ కర్నాడ్ (బ్రహ్మానందం)కి మొబైల్‌లో ఆర్డర్లు జారీ చేసే సన్నివేశాలైతే కడుపుబ్బ నవ్విస్తాయి. శ్రీయ తో గ్రామీణ వాతావరణంలో నటించిన సన్నివేశాలు.. అక్కినేని చైతన్యల అల్లరి సన్నివేశాలు.. ఇలా ఏ సన్నివేశానికి ఆ సన్నివేశం...దీన్ని ఉదహరించలేదే? అన్నట్టుగా సాగాయి. మనసు ని ఉరకలెత్తించాయి. డా.అక్కినేని గురించి ఏం చెబుతాం? అనే్నళ్ల వయసులోనూ రేపటి తరంతో పోటీ పడి మరీ ‘జీవించాడు’. నాగచైతన్య సినీ కెరీర్‌లో ఒక మైలురాయి ఈ చిత్రం. ఎందుకంటే...తండ్రితో తాతతో కలిసి నటించే అదృష్టాన్నీ అవకాశాన్నీ ఏ మాత్రం వదులుకోకుండా.. తన సత్తా చాటాడు. అతడి నటనలో పరిణతి కనిపించింది. రామలక్ష్మిగా శ్రీయకి చాన్నాళ్ల తర్వాత సరైన రోల్ దొరికింది. ప్రియగానూ.. కృష్ణవేణిగానూ కనిపించిన సమంత - కృష్ణవేణిగా అందంగా కనిపించింది. ఎమ్మెస్, అలీ, కృష్ణుడు, శరణ్య... ఇలా పాత్రలన్నీ వచ్చి వెళ్లేవే. ఇకపోతే... పైన చెప్పినట్టుగా.. కనిపించని మలుపులే కాదు.. ఊహించని ట్విస్ట్‌లూ ఉన్నారుూ చిత్రంలో. మొదటి భాగంలో అమితాబ్, అమల.. సడెన్‌గా వచ్చి వెళ్లటం.. ఆఖరున అఖిల్ రావటం... మాటల్లో చెప్పలేని అనుభూతిని కలిగించింది. సినిమాకి మరింత బలాన్ని చేకూర్చింది వనమాలి, చంద్రబోస్ పాటలు. ఆ పాటలకి తగ్గట్టు అనూప్ రూబెన్స్ సంగీతపు సరిగమలు. అన్నీ మాంటేజ్ సాంగ్స్‌తో కావటంవల్ల కనుల తెరపై అందంగా కదలాడి.. మనసులో చెరగని ముద్ర వేశా యి.
1935 నేపథ్యాన్ని అందంగా తీర్చిదిద్దటంలో భాగంగా - గోల్డ్‌స్పాట్ డ్రింక్, మెటాడోర్, అంబాసిడర్ కార్లు.. ఇలా నిన్నటి ప్రపంచాన్ని ఆవిష్కరించటంలోనూ.. ప్రతీ ఫ్రేమ్‌లో ‘రిచ్‌నెస్’ చూపటంలోనూ వినోద్ ఫొటోగ్రఫీ దర్శకుడికి తోడయింది.
మళ్లీ మొదటికి వస్తే... అసలీ కథని అనుకోవటం వెనుక నాగార్జున రియల్ లైఫ్ నేపథ్యం ఉందా? అన్న అనుమానం కూడా రావొచ్చు. తెలిసిన వాళ్లు ‘మనం’ చూసి ఇది నాగార్జున కథే అంటారు. ఇక్కడ ఆ విషయం ప్రస్తావించనప్పటికీ.. ఒక్కసారి ‘రీళ్ల’ని రివైండ్ చేస్తే ‘నాగ్’ నేపథ్యం అర్థమవుతుంది. ఈ సినిమాలోని కేరెక్టర్లన్నీ అవేనంటారు అభిమానులు. ‘ప్రేమ’ అన్న భావగర్భితమైన మాటని ఇంత అందంగా స్క్రీన్‌పై పెట్టొచ్చునన్న ఆలోచనకి నూటికి నూరుపాళ్లు న్యాయం జరిగింది. కథ కొద్దిగా కన్‌ఫ్యూజన్‌గా లేదూ అంటారా? ఒక్కసారి కాదు.. రెండు మూడుసార్లు సినిమా చూడండి. ఏ గందరగోళం ఉండదు. అంతా క్లియర్ కట్. కథకి తగ్గట్టుగానే - ఒక్కో సన్నివేశంలో ఒక్కో నేపథ్యాన్ని చక్కగా ప్రయోగించాడు. ఫిబ్రవరి 14- గంటల స్తంభం.. చేప పిల్లలు చనిపోవటం - కుక్క అదే పనిగా అరవటం - ఇలా ఎనె్నన్నో.
ఎవరూ తక్కువ చేయలేదు. అలాగని ‘అతి’ చేయలేదు. పాత్ర పరిధి మేరకు ‘మూడు తరాల హీరోలు’ తామే సినిమా భారాన్ని తేలిగ్గా మోస్తూ.. అనుభూతుల తీరానికి చేర్చారు. ఆ ఎంగ్జైటీని ‘అఖిల్’ తెరంగేట్రంలోనూ చూపించారు. ఇంటర్వ్యూలో అడిగితే - ‘మనం’లో అఖిల్ లేడు. తాతగారిని మళ్లీ షూటింగ్ టైంలో చూడగలడో లేదోనని అతణ్ణి పిలిచాను అన్నాడు నాగార్జున. వీరంతా కలిసి గ్రూప్ ఫొటో దిగటం.. అమల, అమితాబ్ ఉన్నట్టుండి ప్రత్యక్షం కావటం.. లావణ్య త్రిపాఠి, నీతూ చంద్ర కనిపించటం.. ఇలాంటివెన్నో షాక్‌ల మీద షాక్‌లు.
నాగార్జున, శ్రీయ, సమంత.. రెండు పాత్రల్లో కనిపిస్తూ.. ఏ పాత్రకి ఆ పాత్ర అన్నట్టు నటించారు. బిజినెస్‌మేన్ పాత్రలో చిన్నపిల్లవాడి మనస్తత్వం.. పల్లెటూరి యువకుడి పాత్రలోనూ నాగార్జున పెర్‌ఫార్మెన్స్ మాటల్లో చెప్పలేనిది. అభిమానులకు అదో కన్నుల పంట. అతడికి ఉండే డ్రెస్ సెన్స్‌ని ఈ చిత్రంలోనూ మెచ్చుకొని తీరాలి. ఇలా చెప్పుకుంటూ వెళ్తూంటే - పేజీలకు పేజీలు. ఇంతటి ముగింపు. సినిమా చూస్తే రాయని ఎన్నో అనుభూతులు ప్రేక్షకుల్ని కట్టి పడేస్తాయి.


akkin

Tuesday, May 27, 2014

Tuesday, April 29, 2014