Friday, July 15, 2011

పెళ్లికి రెడీ..

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ఎట్టకేలకు ప్రభుదేవా, నయనతారల పెళ్లి ముహూర్తం దగ్గరకు వచ్చేస్తోంది. వాళ్లిద్దరూ పెళ్లి ఏర్పాట్లలో వున్నట్లు కోలీవుడ్ సమాచారం. ప్రభుదేవా తమతో వుండేలా చూడాలంటూ భార్య రమలత కోర్టులో పిటీషన్‌లు దాఖలు చేసింది. అందుకు ఇరు కుటుంబాల నుండి స్పందన లేకపోవడంతో ఇద్దరు ఇష్టపూర్వకంగా విడాకులను పొందేందుకు కోర్టుకు విన్నవించారు. ప్రభుదేవా, రమలత విడాకుల కేసు విచారణకు ఇరువురూ హాజరుకాలేదు. వ్యక్తిగత కారణాలరీత్యా హాజరుకాలేమని వారు తమ న్యాయవాదుల ద్వారా కోర్టుకు తెలియజేశారు. దీంతో ఈ కేసు వాయిదాపడింది. తన మొదటి భార్య రమలతకు ఇచ్చిన హామీ మేరకు తొలి విడతగా రూ.5 లక్షల రూపాయలను ఇటీవల ప్రభుదేవా చెల్లించారు. అలాగే చెన్నరు అన్నా నగరంలోని ప్లాట్, ఫామ్‌హౌస్, మరో మూడు ప్లాట్‌లను, చెన్నరు ఈసిఆర్ రోడ్డులోని 22 సెంట్ల ప్లాటును హైదరాబాద్‌లోని స్థలంతోపాటు రెండు కార్లను కూడా రమలత తన ఇద్దరు కుమారులు రిషి, ఆదిత్య పేర్లమీద రిజిస్టర్ చేయించారు. పిల్లల చదువులకు అయ్యే ఖర్చునంతా ఆయనే భరించనున్నారు. మొత్తానికి ప్రభుదేవా నయనతార కోసం ఇవన్నీ వదులుకోవలసి వచ్చింది. ఇది ఇలా వుండగా సినీ నేస్తాలు ఇక సెలవు అంటూ నయనతార గద్గద స్వరంతో నమస్కరిస్తూ కంటతడి పెట్టింది. ప్రభుదేవా, నయనతార త్వరలో పెళ్లికి సిద్దం అవుతున్న విషయం తెలిసిందే. దీంతో నయనతార నటనకు స్వస్తి పలకనున్నారు. ప్రభుదేవా దర్శకత్వం వహించిన విల్లు చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటించారు. ఆ సమయంలోనే ఇద్దరు ప్రేమలో పడ్డారు. అనంతరం పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. అయితే ప్రభుదేవాకు అప్పటికే పెళ్లయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ప్రభుదేవా, నయనతార చెట్టాపట్టాలేసుకుని తిరగడాన్ని ఆయన భార్య రమాలత తీవ్రంగా ఖండించారు. తరువాత ఒక ఒప్పందంతో వివాహ రద్దుకు సమ్మతించారు. కోర్టు త్వరలో వీరి వివాహ రద్దును ప్రకటించనుంది. దీంతో ప్రభుదేవా, నయనతారల పెళ్లికి లైన్ క్లియర్ కానుంది. కాగా వివాహనంతరం సినిమాల్లో నటించకూడదని నయనతారకు ప్రభుదేవా కండిషన్ పెట్టారట. అందుకు ఆమె కూడా సమ్మతించారట. ప్రస్తుతం నయనతార ‘శ్రీరామరాజ్యం’ అనే తెలుగు చిత్రంలో నటించారు. ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సమయంలోనే నయన కంటతడి పెట్టింది. ఇదే నయన చివరి చిత్రం. బాలకృష్ణ రాముడిగా, నయనతార సీతగా ఇందులో నటించారు. ప్రస్తుతం ప్రభుదేవా, నయనతార ముంబయిలో ఉంటున్నారు. వీరి వివాహం కూడా ముంబయిలోనే జరిగే అవకాశం ఉంది. కాగా శ్రీరామరాజ్యం షూటింగ్ కోసం ముంబయి నుంచి హైదరాబాద్ వచ్చిన నయనతార ఆ చిత్ర షూటింగ్ పూర్తయిన అనంతరం యూనిట్ సభ్యులందరినీ కలుసుకుని నమస్కరిస్తూ బాధగా సెలవు తీసుకుంది. *

No comments:

Post a Comment